హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కొద్దిరోజుల క్రితం మీడియా సర్కిల్స్, సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయ్యాడో చూశాం. నిర్మాత నిరంజన్ రెడ్డి, తన మధ్య జరిగిన ఆరోపణలు ప్రత్యారోపణలతో వ్యవహారం ఫిలిం ఛాంబర్ కు చేరింది. ఇంకా పరిష్కారం దిశగా చర్యలు చేపట్టలేదు కానీ త్వరలోనే ఆ దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. ఇదిలా ఉండగా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకున్న సినిమాల్లో జై హనుమాన్ కీలకమైంది. రిషబ్ శెట్టి నటిస్తుండటంతో అంచనాలు అనౌన్స్ మెంట్ స్టేజి నుంచే పీక్స్ లో ఉన్నాయి. దానికి తోడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణమంటే ఎక్కడా రాజీపడే ప్రసక్తే ఉండదు.
ఇదంతా ఓకే కానీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ప్రశాంత్ వర్మ వీలైనంత తొందరపడటం మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి వారణాసిలో ఏకంగా మహేష్ బాబుతోనే రాముడి వేషం వేయించారు. దీంతో సహజంగానే హనుమంతుడి క్యారెక్టర్ తను చేసే విన్యాసాలు ఎంతో కొంత ఉంటాయి. రన్బీర్ కపూర్ రామాయణం గురించి తెలిసిందే. నితీష్ తివారి ఇప్పటికే మొదటి భాగం షూట్ పూర్తి చేశారు. ఇది ఫుల్ లెన్త్ ఎపిక్ కాబట్టి హనుమంతుడి పాత్ర ఎక్కువసేపు ఉంటుంది. అందులోనూ సన్నీ డియోల్ చేశాడంటే మరింత ఫోకస్ ఖాయం. ఈ రెండు సినిమాలు వేల కోట్ల బడ్జెట్ తో తీస్తున్నవి.
ఇవి వచ్చాక ప్రశాంత్ వర్మ జై హనుమాన్ వస్తే కనక విజువల్స్, మేకింగ్, విఎఫెక్స్, కంటెంట్ పరంగా ఖచ్చితంగా పోలికలు వస్తాయి. తేజ సజ్జతో హనుమాన్ తీసినప్పుడు ఏ సమస్యా లేదు. ఎందుకంటే అప్పుడు మార్కెట్ లో అలాంటి ఫాంటసీ మూవీ ఏదీ లేదు కాబట్టి. కానీ జై హనుమాన్ రిలీజయ్యే నాటికి రన్బీర్, మహేష్ ఇద్దరి సినిమాలు వచ్చేసి ఉంటాయి. వాటికన్నా మెరుగ్గా తన జై హనుమాన్ ని చూపిస్తేనే ప్రశాంత్ వర్మ పాసవుతాడు. ఇది చాలా పెద్ద సవాల్. హనుమాన్ టైంకి, జై హనుమాన్ మొదలుపెట్టే నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మరి ఈ పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.
This post was last modified on November 16, 2025 4:36 pm
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…