ఓ కన్నడ సినిమా ఆ భాషలోనే కాక తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి తెరకెక్కడం.. అన్ని చోట్లా ఒకేసారి విడుదల కావడమే ఆశ్చర్యమంటే అన్ని చోట్లా అద్భుత విజయం సాధించడం అసామాన్యమైన విషయం. రెండేళ్ల కిందట కేజీఎఫ్ ఈ అద్భుతమే చేసింది. ఆ సినిమా ప్రోమోలు చూసినపుడు చాలామందికి తెలుగు బ్లాక్బస్టర్ ఛత్రపతినే గుర్తుకు వచ్చింది. సినిమా చూస్తున్నపుడు కూడా ఆ సినిమా ఛాయలు అక్కడక్కడా కనిపించాయి.
యశ్ రాకీ పాత్రలో ఎంత బాగా చేసినప్పటికీ.. ఆ స్థానంలో ప్రభాస్ ఉంటే సినిమా రేంజే వేరుగా ఉండేదనే అభిప్రాయం చాలామంది తెలుగు ప్రేక్షకుల్లో కలిగింది. ప్రభాస్ కటౌట్, అతడికున్న ఇమేజ్కు అలాంటి హీరో ఎలివేషన్లు ఉంటే మాస్ ప్రేక్షకులకు పూనకాలొచ్చేసేవే.
కేజీఎఫ్లో ప్రభాస్ నటించకపోయినా.. ఈ సినిమాతో గొప్ప పేరు సంపాదించిన ప్రశాంత్ నీల్తో తర్వాతైనా జట్టు కడితే కాంబినేషన్ అదిరిపోతుందని, ఇద్దరూ కలిసి మాంచి మాస్, యాక్షన్ సినిమా చేస్తే బాక్సాఫీస్ షేకైపోతుందని అనుకున్నారు జనాలు. ఐతే ప్రభాస్కు అనేక కమిట్మెంట్లు ఉండగా.. ఓ కన్నడ దర్శకుడు వచ్చి అతడికి కథ చెబుతాడని, అది అతడికి నచ్చుతుందని.. ఇప్పుడిప్పుడే ఈ కాంబినేషన్ కార్యరూపం దాలుస్తుందని ఎవరూ అనుకోలేదు.
మధ్యలో ప్రభాస్-ప్రశాంత్ కాంబో గురించి వార్తలొచ్చినా నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆ కలయికలో సినిమా ఓకే అయిపోయింది. ఇంకో నెల రోజుల్లో వీరి సినిమా సెట్స్ మీదికి వెళ్లిపోతోంది. ఇది దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎగ్జైట్ చేస్తోంది. ఈ కాంబోపై అంచనాలు మామూలుగా లేవు. మరి ప్రేక్షకులు కోరుకున్నట్లే ఇద్దరూ కలిసి ఓ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్తో అందరినీ అలరిస్తారేమో చూడాలి.
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…
సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతం వస్తున్నా.. అక్కడ కలుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణకు ఆదివారం సీఎం చంద్రబాబు…
పెద్ది ఫలితం బాగుంది. కలెక్షన్లు చక్కగా వస్తున్నాయి. సోమవారం పరీక్ష కూడా నెగ్గింది. అయితే ఎక్కడో చిన్న అసంతృప్తి అభిమానులను…
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల…