బతికి ఉన్నపుడు ఓ వ్యక్తికి ఎలాంటి పేరున్నా చనిపోయినపుడు అందరూ మంచే మాట్లాడతారు. విమర్శలు చేయరు. పాత విషయాల్ని పట్టుకుని తిట్టిపోయరు. అలాంటిది ఇర్ఫాన్ ఖాన్ లాంటి దిగ్గజ నటుడు, గొప్ప మానవతా వాది చనిపోతే.. అతడి గురించి విమర్శలు చేయడం, తగిన శాస్తి జరిగిందని చంకలు గుద్దుకుంటున్న వాళ్లను.. తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు అంటూ ఓపెన్గా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే వాళ్లను ఏమనాలి? ఇలాంటి కామెంట్లు చేస్తున్నది అల్లా టప్పా వాళ్లు కాదు. పేరున్న జర్నలిస్టులు.. ముస్లిం మత పెద్దలు.
దీనికి కారణం గతంలో ఇర్ఫాన్ చేసిన హేతువాద వ్యాఖ్యలే. గతంలో ఇర్ఫాన్ ఇస్లాం మత ఆచారాలపై కొన్ని విమర్శలు చేశాడు. మత మౌఢ్యాన్ని ఖండించాడు.
రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి.. గొర్రెల్ని చంపి తినడం అసాంఘికం అన్నాడు. జంతు వధను ఖండించాడు. అలాగే విషాదానికి ప్రతీక అయిన మొహర్రం పండుగ రోజు సంబరాలు చేసుకోవడాన్ని కూడా తప్పుబట్టాడు. ముస్లిం మత పెద్దలకు కోపం తెప్పించే ఇలాంటి కామెంట్లు మరికొన్ని చేశాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. అతడికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. తన సినిమాల్ని బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు.
ఆ సంగతలా వదిలేస్తే.. రెండేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న ఇర్ఫాన్ రెండు రోజుల కిందట తనువు చాలించాడు. ఈ విషాద సమయంలో అతడి గురించి ఓ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు దారుణం. రంజాన్ను, ముస్లింల మత విశ్వాసాల్ని కించపరిచాడని.. అందుకే అల్లా అతణ్ని శిక్షించాడని.. ఇర్ఫాన్కు తగిన శాస్తి జరిగిందని అన్నాడు. దీన్ని ఎండోర్స్ చేస్తూ మరిందరు ఛాందసవాదులు కామెంట్లు పెట్టడం గమనార్హం.
This post was last modified on May 2, 2020 4:12 pm
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వరుసగా అయిదోసారి ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి…