బతికి ఉన్నపుడు ఓ వ్యక్తికి ఎలాంటి పేరున్నా చనిపోయినపుడు అందరూ మంచే మాట్లాడతారు. విమర్శలు చేయరు. పాత విషయాల్ని పట్టుకుని తిట్టిపోయరు. అలాంటిది ఇర్ఫాన్ ఖాన్ లాంటి దిగ్గజ నటుడు, గొప్ప మానవతా వాది చనిపోతే.. అతడి గురించి విమర్శలు చేయడం, తగిన శాస్తి జరిగిందని చంకలు గుద్దుకుంటున్న వాళ్లను.. తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు అంటూ ఓపెన్గా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే వాళ్లను ఏమనాలి? ఇలాంటి కామెంట్లు చేస్తున్నది అల్లా టప్పా వాళ్లు కాదు. పేరున్న జర్నలిస్టులు.. ముస్లిం మత పెద్దలు.
దీనికి కారణం గతంలో ఇర్ఫాన్ చేసిన హేతువాద వ్యాఖ్యలే. గతంలో ఇర్ఫాన్ ఇస్లాం మత ఆచారాలపై కొన్ని విమర్శలు చేశాడు. మత మౌఢ్యాన్ని ఖండించాడు.
రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి.. గొర్రెల్ని చంపి తినడం అసాంఘికం అన్నాడు. జంతు వధను ఖండించాడు. అలాగే విషాదానికి ప్రతీక అయిన మొహర్రం పండుగ రోజు సంబరాలు చేసుకోవడాన్ని కూడా తప్పుబట్టాడు. ముస్లిం మత పెద్దలకు కోపం తెప్పించే ఇలాంటి కామెంట్లు మరికొన్ని చేశాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. అతడికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. తన సినిమాల్ని బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు.
ఆ సంగతలా వదిలేస్తే.. రెండేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న ఇర్ఫాన్ రెండు రోజుల కిందట తనువు చాలించాడు. ఈ విషాద సమయంలో అతడి గురించి ఓ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు దారుణం. రంజాన్ను, ముస్లింల మత విశ్వాసాల్ని కించపరిచాడని.. అందుకే అల్లా అతణ్ని శిక్షించాడని.. ఇర్ఫాన్కు తగిన శాస్తి జరిగిందని అన్నాడు. దీన్ని ఎండోర్స్ చేస్తూ మరిందరు ఛాందసవాదులు కామెంట్లు పెట్టడం గమనార్హం.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…