Movie News

అల్లా ఆగ్రహమే ఇర్ఫాన్ మరణానికి కారణమట

బతికి ఉన్నపుడు ఓ వ్యక్తికి ఎలాంటి పేరున్నా చనిపోయినపుడు అందరూ మంచే మాట్లాడతారు. విమర్శలు చేయరు. పాత విషయాల్ని పట్టుకుని తిట్టిపోయరు. అలాంటిది ఇర్ఫాన్ ఖాన్ లాంటి దిగ్గజ నటుడు, గొప్ప మానవతా వాది చనిపోతే.. అతడి గురించి విమర్శలు చేయడం, తగిన శాస్తి జరిగిందని చంకలు గుద్దుకుంటున్న వాళ్లను.. తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు అంటూ ఓపెన్‌గా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే వాళ్లను ఏమనాలి? ఇలాంటి కామెంట్లు చేస్తున్నది అల్లా టప్పా వాళ్లు కాదు. పేరున్న జర్నలిస్టులు.. ముస్లిం మత పెద్దలు.

దీనికి కారణం గతంలో ఇర్ఫాన్ చేసిన హేతువాద వ్యాఖ్యలే. గతంలో ఇర్ఫాన్ ఇస్లాం మత ఆచారాలపై కొన్ని విమర్శలు చేశాడు. మత మౌఢ్యాన్ని ఖండించాడు.

రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి.. గొర్రెల్ని చంపి తినడం అసాంఘికం అన్నాడు. జంతు వధను ఖండించాడు. అలాగే విషాదానికి ప్రతీక అయిన మొహర్రం పండుగ రోజు సంబరాలు చేసుకోవడాన్ని కూడా తప్పుబట్టాడు. ముస్లిం మత పెద్దలకు కోపం తెప్పించే ఇలాంటి కామెంట్లు మరికొన్ని చేశాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. అతడికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. తన సినిమాల్ని బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు.

ఆ సంగతలా వదిలేస్తే.. రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఇర్ఫాన్ రెండు రోజుల కిందట తనువు చాలించాడు. ఈ విషాద సమయంలో అతడి గురించి ఓ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు దారుణం. రంజాన్‌ను, ముస్లింల మత విశ్వాసాల్ని కించపరిచాడని.. అందుకే అల్లా అతణ్ని శిక్షించాడని.. ఇర్ఫాన్‌కు తగిన శాస్తి జరిగిందని అన్నాడు. దీన్ని ఎండోర్స్ చేస్తూ మరిందరు ఛాందసవాదులు కామెంట్లు పెట్టడం గమనార్హం.

This post was last modified on May 2, 2020 4:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: Bollywood

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago