కంటెంట్ ఉంటే యాక్టర్స్ తో సంబంధం లేకుండా చిన్న సినిమాలైనా బాగా ఆడతాయనే నమ్మకాన్ని బలగం నుంచి లిటిల్ హార్ట్స్ దాకా ఎన్నో కలిగించాయి. రాజు వెడ్స్ రాంబాయి టీమ్ కూడా తమ మూవీ మీద అంతే నమ్మకంతో ఉంది. నవంబర్ 21 విడుదల కాబోతున్న ఈ విలేజ్ డ్రామాని విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగుల నిర్మించడం విశేషం. ఈటీవీ విన్ అండదండలతో థియేటర్ రిలీజ్ జరుపుకోబోతున్న రాజు వెడ్స్ రాంబాయి ట్రైలర్ ఇవాళ లాంచ్ చేశారు. టైటిల్ సాంగ్ ఇప్పటికే ఛార్ట్ బస్టర్ కాగా కథ పరంగా ఏముందో ఎక్కువ దాచకుండా మూడున్నర నిమిషాల వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు.
ఆదో పల్లెటూరు. పండగలకు పబ్బాలకు డ్రమ్ములు వాయించే రాజు (అఖిల్ రాజ్) అంటే ఊళ్ళో అమ్మాయిలకే భలే క్రేజ్. కాలేజీలో చదువుకునే రాంబాయి (తేజస్వి రావు) ముందు రాజుని తిట్టుకున్నా క్రమంగా అతని ప్రేమలో పడుతుంది. గర్భం దాలిస్తే పెద్దలు పెళ్ళికి ఒప్పుకుంటారనే అమాయకత్వంలో ఇద్దరూ ఒక్కటవుతారు. అయితే వీళ్ళ ప్రేమ వ్యవహారం రాంబాయి తండ్రికి తెలిశాక వ్యవహారం సీరియస్ గా మారుతుంది. ఇంకోవైపు ఈమె దక్కదనే భయంతో రాజు అతిప్రేమతో వయొలెంట్ గా మారి ప్రియురాలిని కొట్టేందుకు కూడా వెనుకాడడు. చివరికి ఏం జరిగిందో థియేటర్ లో చూడాలి.
రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామాగా దర్శకుడు సాయిలు కాంపతి తెరకెక్కించిన తీరు ఇలాంటి ఎమోషనల్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది . సురేష్ బొబ్బిలి సంగీతం, ఆర్టిస్టుల సహజ నటన ప్లస్ అవుతున్నాయి. స్టోరీ చెప్పినట్టే ఉంది కానీ ముఖ్యమైన ట్విస్టులను మాత్రం రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. తండ్రి, ప్రియుడి మధ్య నలిగిపోయే అమ్మాయి సంఘర్షణని కథగా చెప్పారు కానీ దాచిపెట్టిన ఎలిమెంట్స్ చాలానే ఉన్నట్టున్నాయి. ప్రమోషన్ల పరంగా బాగానే కష్టపడుతున్న రాజు వెడ్స్ రాంబాయి లవ్ స్టోరీ కంచికి చేరుతుందో లేదో వచ్చే శుక్రవారం తేలనుంది.
This post was last modified on November 13, 2025 6:43 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…