ఒక సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించడానికి సిద్ధమైంది మహేష్ బాబు-రాజమౌళి చిత్ర యూనిట్. షూటింగ్ మొదలై చాన్నాళ్లయినా ఇప్పటిదాకా ఈ సినిమా విశేషాలేమీ పంచుకోని సంగతి తెలిసిందే. ఈ నెల 15న టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కొన్ని వారాల ముందే పనులు మొదలయ్యాయి.
ఈ ఈవెంట్కు వారం ముందు నుంచి వేరే అప్డేట్స్ ఇస్తోంది చిత్ర బృందం. వీటికి మంచి స్పందనా వస్తోంది. ఇక ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ ఈవెంట్ ఎలా ఉండబోతోందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్ను విశాల ప్రాంగణంలో నిర్వహించబోతున్నారు. అక్కడ ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్ నిర్మాణం కూడా జరుగుతోంది. దాదాపు లక్షమంది అభిమానుల మధ్య ఈ వెంట్ చేయాలనుకున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సాఫీగా సాగిపోతున్న వేళ.. దేశంలో అలజడి నెలకొంది.
దిల్లీలో కారు బాంబు పేలుడు ఘటన తర్వాత దేశవ్యాప్తంగా హై అలెర్ట్ నెలకొంది. మెట్రో నగరాలన్నింటినీ అప్రమత్తం చేశారు. ఆ సిటీస్ కేంద్ర బలగాల చేతుల్లోకి వెళ్లాయి. ఉగ్రవాదులు మరిన్ని పేలుళ్లకు కుట్ర చేశారన్న సమాచారంతో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇంత భారీ జనంతో ఈవెంట్ నిర్వహించడం సాధ్యమా.. అందుకు అనుమతులు లభిస్తాయా అన్నది అనుమానంగా మారింది. మహేష్ బాబు, రాజమౌళి సహా ఎంతోమంది వీఐపీలు ఈ ఈవెంట్లో పాల్గొంటారు.
ఈ ఈవెంట్ కోసం భారీగా పోలీసు బలగాలను మోహరించాల్సి ఉంటుంది. లక్షమంది కాకపోయినా 50-60 వేల మంది జనాన్నయైనా కంట్రోల్ చేయడం, ఈవెంట్ సాఫీగా నిర్వహించడం అంత తేలిక కాదు. ఈ నేపథ్యంలో ఈవెంట్ను రద్దు చేసే పరిస్థితి వస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈవెంట్ను వాయిదా వేయలేని పరిస్థితులు ఉంటే.. అభిమానుల సంఖ్యను బాగా తగ్గించి.. చిన్న స్థాయిలో చేసుకోవాలనే ఆదేశాలు రావచ్చు. భద్రత బలగాలను కూడా బాగా తగ్గించే అవకాశాలున్నాయి.
This post was last modified on November 13, 2025 9:52 am
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…