ఒక సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించడానికి సిద్ధమైంది మహేష్ బాబు-రాజమౌళి చిత్ర యూనిట్. షూటింగ్ మొదలై చాన్నాళ్లయినా ఇప్పటిదాకా ఈ సినిమా విశేషాలేమీ పంచుకోని సంగతి తెలిసిందే. ఈ నెల 15న టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కొన్ని వారాల ముందే పనులు మొదలయ్యాయి.
ఈ ఈవెంట్కు వారం ముందు నుంచి వేరే అప్డేట్స్ ఇస్తోంది చిత్ర బృందం. వీటికి మంచి స్పందనా వస్తోంది. ఇక ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ ఈవెంట్ ఎలా ఉండబోతోందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్ను విశాల ప్రాంగణంలో నిర్వహించబోతున్నారు. అక్కడ ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్ నిర్మాణం కూడా జరుగుతోంది. దాదాపు లక్షమంది అభిమానుల మధ్య ఈ వెంట్ చేయాలనుకున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సాఫీగా సాగిపోతున్న వేళ.. దేశంలో అలజడి నెలకొంది.
దిల్లీలో కారు బాంబు పేలుడు ఘటన తర్వాత దేశవ్యాప్తంగా హై అలెర్ట్ నెలకొంది. మెట్రో నగరాలన్నింటినీ అప్రమత్తం చేశారు. ఆ సిటీస్ కేంద్ర బలగాల చేతుల్లోకి వెళ్లాయి. ఉగ్రవాదులు మరిన్ని పేలుళ్లకు కుట్ర చేశారన్న సమాచారంతో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇంత భారీ జనంతో ఈవెంట్ నిర్వహించడం సాధ్యమా.. అందుకు అనుమతులు లభిస్తాయా అన్నది అనుమానంగా మారింది. మహేష్ బాబు, రాజమౌళి సహా ఎంతోమంది వీఐపీలు ఈ ఈవెంట్లో పాల్గొంటారు.
ఈ ఈవెంట్ కోసం భారీగా పోలీసు బలగాలను మోహరించాల్సి ఉంటుంది. లక్షమంది కాకపోయినా 50-60 వేల మంది జనాన్నయైనా కంట్రోల్ చేయడం, ఈవెంట్ సాఫీగా నిర్వహించడం అంత తేలిక కాదు. ఈ నేపథ్యంలో ఈవెంట్ను రద్దు చేసే పరిస్థితి వస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈవెంట్ను వాయిదా వేయలేని పరిస్థితులు ఉంటే.. అభిమానుల సంఖ్యను బాగా తగ్గించి.. చిన్న స్థాయిలో చేసుకోవాలనే ఆదేశాలు రావచ్చు. భద్రత బలగాలను కూడా బాగా తగ్గించే అవకాశాలున్నాయి.
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…