కొన్ని నెలల క్రితం రీ రిలీజ్ జరుపుకున్న జగదేకవీరుడు అతిలోకసుందరికి అభిమానుల నుంచే కాదు ప్రేక్షకుల నుంచి కూడా అపూర్వమైన మద్దతు దొరికింది. అయితే వైజయంతి మూవీస్ సంస్థ ఎంత కస్టపడి రీ మాస్టరింగ్ చేసినా దాని క్వాలిటీకి పెదవి విరుపులే ఎక్కువ వినిపించాయి. నెగటివ్స్ మరీ దారుణంగా పాడైపోవడంతో వాటికి పూర్వ స్థితికి తేవడం టీమ్ కు సవాల్ గా మారింది. అయినా కూడా ఎఫర్ట్స్ చాలా పెట్టారు కానీ పూర్తి ప్రయోజనం కలగలేదు. దానికున్న వింటేజ్ స్టేటస్, చిరు శ్రీదేవి జోడి, ఇళయరాజా పాటలు జనాన్ని థియేటర్లకు వచ్చేలా చేశాయి. నాణ్యత విషయంలో అసంతృప్తి అలాగే ఉండిపోయింది
ఇప్పుడా కొరతను తగ్గించేందుకా అన్నట్టు నవంబర్ 21 కొదమసింహం రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రత్యేకంగా దీని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ట్రైలర్ లో చూపించిన విజువల్స్, క్వాలిటీకి వావ్ అనకుండా ఉండలేం. అంత బాగా రీ మాస్టరింగ్ చేశారు. ఆర్టిస్టుల హావభావాలు, బ్యాక్ గ్రౌండ్, డీటెయిల్స్ అన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. 1990లో వచ్చిన ఈ కౌబాయ్ మూవీ మొదటిసారి విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద జస్ట్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. క్రమంగా కాలం గడిచే కొద్దీ కల్ట్ స్టేటస్ సంపాదించుకుని మూవీ లవర్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
సినీ విశ్లేషకులు కొదమసింహం రికమండ్ చేయడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. కౌబాయ్ గా చిరంజీవి స్టైల్, స్వాగ్ ఇందులో చాలా కొత్తగా ఉంటుంది ఫైట్స్, ఛేజులు, డాన్సుల్లో ఆయన హుషారు నెక్స్ట్ లెవెల్ లో చూడొచ్చు. రాజ్ కోటి పాటలు, కె మురళీమోహన్ రావు దర్శకత్వం, దత్తు కెమెరా పనితనం ఒకదానితో మరొకటి పోటీ పడతాయి. కొదమసింహంలో ఎడారి ఎపిసోడ్ ని స్ఫూర్తిగా తీసుకునే రాజమౌళి తన మగధీరలో రామ్ చరణ్ గుర్రం మధ్య ఎడారి సీన్ పెట్టారు. ఇది స్వయంగా ఆయన చెప్పిన విశేషమే. సో మెగా ఫ్యాన్స్ నోస్టాల్జియాగా ఫీలైతే మూవీ లవర్స్ కి ఒక స్పెషల్ మెమరీగా కొదమసింహం నిలవనుంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…