బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు సీఐడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, “మొదట అది గేమింగ్ యాప్ అనుకుని ప్రమోషన్ చేశాను. తర్వాత అది బెట్టింగ్ యాప్ అని తెలిసిన వెంటనే తప్పుకున్నాను. బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నేను చేసినది తప్పు అని ఒప్పుకుంటున్నాను” అన్నారు.
అలాగే ఆయన పేర్కొంటూ, “2016లో నేను ఆ యాప్కు ప్రమోషన్ చేశాను. 2017లో ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్పై నిషేధం విధించింది. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అప్పటి నుంచి ఇలాంటి యాప్స్ను ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. యువత కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకూడదు” అని సూచించారు.
మియాపూర్, సైబరాబాద్ ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు సీఐడీకి బదిలీ అయ్యాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే కేసులో గత జూలై 30న ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు.
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…