బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు సీఐడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, “మొదట అది గేమింగ్ యాప్ అనుకుని ప్రమోషన్ చేశాను. తర్వాత అది బెట్టింగ్ యాప్ అని తెలిసిన వెంటనే తప్పుకున్నాను. బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నేను చేసినది తప్పు అని ఒప్పుకుంటున్నాను” అన్నారు.
అలాగే ఆయన పేర్కొంటూ, “2016లో నేను ఆ యాప్కు ప్రమోషన్ చేశాను. 2017లో ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్పై నిషేధం విధించింది. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అప్పటి నుంచి ఇలాంటి యాప్స్ను ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. యువత కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకూడదు” అని సూచించారు.
మియాపూర్, సైబరాబాద్ ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు సీఐడీకి బదిలీ అయ్యాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే కేసులో గత జూలై 30న ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు.
This post was last modified on November 12, 2025 10:04 pm
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…