Movie News

సందీప్ వంగా కెమెరాలో చిరు కనిపిస్తే

అర్జున్ రెడ్డి, యానిమల్ తో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా త్వరలో ప్రభాస్ స్పిరిట్ మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే దీని గురించి రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వచ్చేశాయి. దాంట్లో ప్రధానంగా స్పిరిట్ లో మెగాస్టార్ చిరంజీవి ఉంటారని, ప్రభాస్ తండ్రిగా ఒక టెర్రిఫిక్ క్యారెక్టర్ డిజైన్ చేశారని ఏవేవో గాసిప్స్ చక్కర్లు కొట్టించారు. జిగ్రీస్ టీమ్ తో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా దీన్ని కొట్టి పారేస్తూ అలాంటిదేం లేదన్న సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు. ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది.

చిరంజీవిని తన కెమెరా లెన్సులో చూడాలని ఉందని, ఒక స్టాండ్ అలోన్ మూవీ కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తానని చెప్పి మెగా ఫ్యాన్స్ చెవుల్లో పాలు పోసినంత పని చేశారు. ఎప్పుడు సాధ్యమవుతుందో చెప్పలేం కానీ భవిష్యత్తులో ఉండే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఎందుకంటే తన ఆఫీస్ లో ఆరాధన సినిమా నుంచి నిలువెత్తు పులిరాజు ఎక్స్ ప్రెషన్ ని ఫోటోగా పెట్టుకున్న సందీప్ వంగా చిరంజీవి మీద పెట్టుకున్నది మాములు ఫ్యానిజం కాదు. మాస్టర్ లో మెగాస్టార్ వేసుకున్న చొక్కా రంగులు, ఎక్స్ ప్రెషన్లతో సహా చాలా డీటెయిల్స్  ఓ సందర్భంలో వివరించడం ఎక్స్, ఇన్స్ టాలో తెగ వైరల్ అయ్యింది.

ఇక చిరంజీవి విషయానికి వస్తే మన శంకరవరప్రసాద్ గారు తర్వాత విశ్వంభర రిలీజ్ ఉంటుంది. ఈలోగా బాబీ డైరెక్షన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. అది కాగానే శ్రీకాంత్ ఓదెల మోస్ట్ వయొలెంట్ డ్రామా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ అయ్యేలోగా 2027 వచ్చేస్తుంది. అప్పటికంతా సందీప్ వంగా స్పిరిట్ పూర్తి చేసి ఉంటే మెగా కాంబోని ట్రై చేయొచ్చు. లేదా పెండింగ్ లో ఉన్న అల్లు అర్జున్ లేదా మహేష్ బాబుతో చేతులు కలపొచ్చు. ఇప్పటికిప్పుడు నిర్ధారణగా ఏదీ చెప్పలేం కానీ మెగాభిమానులు కోరుకుంటున్న కలయికలో చిరు – సందీప్ అయితే ఎప్పటికీ ఉంటుంది. వీలైనంత త్వరగా కార్యరూపం దాలిస్తే చాలు.

This post was last modified on November 12, 2025 10:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago