మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక సాలిడ్ కమ్ బ్యాక్ కోసం చూస్తున్నారు అభిమానులు. ‘ఖైదీ నంబర్ 150’తో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చిన చిరు.. ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ మినహా ఏ చిత్రంతోనూ అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేకపోయాడు. ‘సైరా’ పాజిటివ్ రెస్పాన్సే తెచ్చుకున్నప్పటికీ.. ఓవర్ బడ్జెట్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ఇక గత ఏడాది ‘భోళా శంకర్’ మూవీతో చిరు ఎంత పెద్ద షాక్ తిన్నాడో తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘మన శంకర వరప్రసాద్’ మూవీ మీద మెగాస్టార్తో పాటు అభిమానులూ భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి అంచనాలను అందుకుంటాడనే భావిస్తున్నారు. సంక్రాంతికి షెడ్యూల్ అయిన ఈ చిత్రానికి సంబంధించి షూట్ చివరి దశలో ఉంది. ఇటీవలే విక్టరీ వెంకటేష్ కూడా సెట్లోకి అడుగు పెట్టాడు. చిరు-వెంకీ కలయికలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు.
ఈ సినిమా నుంచి రిలీజైన తొలి పాట ‘మీసాల పిల్ల’ చార్ట్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ పాటకు కొన్ని పేర్లను పరిశీలించి చివరికి ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యధిక ఐటెం సాంగ్స్ చేస్తున్న తమన్నా భాటియాకే ఓటు వేసినట్లు చెబుతున్నారు. ‘స్త్రీ’ సహా పలు చిత్రాల్లో తమన్నా చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.
ఇంతకుముందు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’లోనూ తమ్మూ ఐటెం సాంగ్ చేసింది. మరోవైపు చిరుతో సైరా నరసింహారెడ్డి, భోళా శంకర్ చిత్రాల్లో జోడీగా నటించింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్తో ఐటెం పాటలో చిందులు వేయనుందట. బహుశా ఈ పాటలో వెంకీ కూడా కనిపిస్తాడేమో అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని గురించి అధికారిక సమాచారం రావచ్చు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 12, 2025 10:44 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…