ఈ నెల మొత్తంలో ఆంధ్రకింగ్ తాలూకా మినహాయించి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో మళ్ళీ రీ రిలీజులు క్యూ కడుతున్నాయి. కాకపోతే వీటిలో తప్పక చూడాల్సినవి, ఇంటరెస్టింగ్ అనిపించేవి కొన్ని ఉన్నాయి. మొదటిది ‘శివ’. నవంబర్ 14న సరికొత్త ఫోర్ కె ప్రింట్, డాల్బీ అట్మోస్ సౌండ్ తో రాబోతున్న ఈ కల్ట్ క్లాసిక్ ని ఆల్రెడీ మీడియా ప్రతినిధులు చూసి వావ్ అనుకున్నారు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ కి ఇప్పటి తరం కూడా స్పెల్ బౌండ్ అవ్వడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ శివ రీ మాస్టరింగ్ వర్క్ మీద నాలుగేళ్ళకు పైగా కస్టపడి పని చేసింది. ఫలితం రావడమే తరువాయి.
ఒక రోజు తర్వాత సిద్దార్థ్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వస్తోంది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ ఎమోషనల్ డ్రామాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, పరుచూరి సంభాషణలు రిపీట్ వేల్యూ తీసుకొచ్చాయి. త్రిష ఫ్యాన్ బేస్ పెరిగేందుకు దోహదపడిన సినిమాల్లో ఇది ఒకటి. నవంబర్ 21 చిరంజీవి ‘కొదమసింహం’ పునఃవిడుదల కానుంది. 1990లో మెగాస్టార్ తొలి కౌబాయ్ మూవీగా దీనికి చాలా ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో కమర్షియల్ గా పెద్ద విజయం సాధించలేదు కానీ క్రమంగా కల్ట్ స్టేటస్ తెచ్చుకుని అభిమానులకు అత్యంత ఫేవరెట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది.
నవంబర్ 22 కార్తీ ‘ఆవారా’ వస్తోంది. గతంలో ఒకసారి షెడ్యూల్ చేసి వాయిదా వేశాక ఇప్పుడు తమిళ వెర్షన్ తో పాటు సమాంతరంగా విడుదల చేస్తున్నారు. నవంబర్ 28 సూర్య ‘సికందర్’ ఉంది. ఇది డిజాస్టరే కానీ సినిమా మొత్తాన్ని రీ ఎడిట్ చేసి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. నవంబర్ 29 మహేష్ బాబు ‘బిజినెస్ మెన్’ వస్తోంది. ఆల్రెడీ ఒకసారి రీ రిలీజ్ చేశారు కానీ స్టేట్ వైడ్ షోలు పడలేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సో రెగ్యులర్ కొత్త రిలీజులతో పాటు ఈ పాతవి కూడా మూవీ లవర్స్ లుక్ వేయాలంటే పర్సుని కాస్త బరువుగా పెట్టుకోక తప్పదు.
This post was last modified on November 12, 2025 9:51 am
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…