ఇవాళ తెల్లవారగానే బాలీవుడ్ లెజెండరీ నటులు ధర్మేంద్ర కన్ను మూశారనే వార్త మూవీ లవర్స్ ని హతాశులను చేసింది. అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ పోరాడుతున్నారనేది వాస్తవం. కానీ కన్ను మూశారని ప్రచారం జరగడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ధర్మేంద్ర ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నారని, అనవసరంగా పుకార్లను వ్యాప్తం చేయొద్దని భార్య హేమా మాలిని, కుమార్తె ఈషా డియోల్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అంటే ధర్మేంద్ర జిందా హై అని తెలియడం అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను సంతోషంలో ముంచెత్తుతోంది.
ధర్మేంద్ర ప్రస్తుత వయసు 89. అయినప్పటికీ తరచుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటారు. మొన్న ఏడాది కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానిలో షబానా ఆజ్మీ మాజీ ప్రియడిగా నటించి ఆశ్చర్యపరిచారు. అప్పుడప్పుడు పార్టీలలో, ఎవరైనా ప్రముఖులు కన్నుమూసినప్పుడు ధర్మేంద్ర రావడం పలు సందర్భాల్లో కనిపించింది. వయసు రిత్యా ఇబ్బందులు ఉన్నప్పటికీ చురుకుగా ఉండే ధర్మేంద్ర పుట్టినరోజు వేడుకలను సైతం ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటారు. అలాంటిది ఇంత హఠాత్తుగా చేదు వార్త వినాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు ఊహించలేదు.
ప్రస్తుతం ఈ పుకారు ఎవరు లేవనెత్తారు అనేది తెలియాల్సి ఉంది. నిన్న రాత్రి సల్మాన్ ఖాన్, సన్నీ డియోల్ తదితరులు హాస్పిటల్ కు వచ్చి ధర్మేంద్రను కలుసుకున్నారు. ఇది చూశాక బహుశా ఆయన చివరి శ్వాసకు దగ్గరగా ఉన్నారేమోననే ప్రచారం ఊపందుకుంది. భాషతో సంబంధం లేకుండా షోలేలో వీరుగా ఎప్పటికీ మర్చిపోలేని నటన ప్రదర్శించిన ధర్మేంద్ర 1970 నుంచి 85 వరకు తిరుగులేని యాక్షన్ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో నటించారు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ట్రెండ్ మొదలయ్యాక క్రమంగా హీరోగా చేయడం తగ్గించుకున్నారు. ఏదైతేనేం ఆయన బ్రతికే ఉన్నారన్న వార్త చాలు.
This post was last modified on November 11, 2025 10:43 am
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…