తెలుగులో ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే సినిమాలో నటించిన తమిళ కథానాయిక గౌరి కిషన్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక సినిమా ప్రమోషన్ కోసం మీడియాను కలిసిన ఆమెను.. ఆర్.ఎస్.కార్తీక్ అనే సీనియర్ తమిళ సినీ జర్నలిస్టు అడిగిన ప్రశ్న దుమారం రేపింది. మీ బరువు ఎంత.. ఈ మధ్య వెయిట్ పెరిగినట్లున్నారే అని ఆ జర్నలిస్టు అడగ్గా.. నేనెందుకు నా వెయిట్ చెప్పాలి అంటూ ఆమె ఫైర్ అయింది.
ఇది అసలు జర్నలిజమే కాదంటూ ఆమె ఆ జర్నలిస్టుతో చాలా సేపు వాగ్వాదానికి దిగింది. ఆ జర్నలిస్టు కూడా గట్టిగానే ఎదురుదాడి చేశాడు. ఐతే సోషల్ మీడియా పూర్తిగా గౌరి వైపే నిలిచింది. ఇవేం ప్రశ్నలు అంటూ ఆ జర్నలిస్టు తీరును అందరూ దుయ్యబట్టారు. అలాంటి ప్రశ్నలు అడగడమే తప్పంటే.. మళ్లీ వాదించడమా అంటూ ఆయన్ని నిలదీశారు. ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ జర్నలిస్టు గౌరి కిషన్కు సారీ చెబుతూ ఒక వీడియో కూడా చేయాల్సి వచ్చింది.
కానీ బేషరతుగా క్షమాపణ చెప్పకుండా.. తన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆయన ఈ వివరణలో పేర్కొన్నాడు. దీంతో గౌరి కిషన్కు ఇంకా కోపం వచ్చింది. ఇదసలు క్షమాపణ లాగే లేదని.. దీన్ని తాను అంగీకరించనని ఆమె తేల్చి చెప్పింది. ఆయన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పడం.. బాడీ షేమింగ్ చేయలేదు అనడం.. అది సరదాగా అన్న ప్రశ్న అనడంపై ఆమె అభ్యంతరం వ్యక్త ంచేసింది.
ఇంకా బెటర్గా ట్రై చేయండి కార్తీక్ అంటూ ఘాటుగా బదులిచ్చింది గౌరి కిషన్. మరోసారి సోషల్ మీడియా ఆమె వైపే నిలిచింది. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఇలాగే స్పందిస్తుందని.. చేసిన తప్పుకి బేషరతుగా క్షమాపణ చెప్పకుండా.. ఇలాంటి వివరణ ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం అని ఆ జర్నలిస్టుపై నెటిజన్లు మరోసారి ఫైర్ అవుతున్నారు.
This post was last modified on November 10, 2025 10:17 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…