ఓవైపు రాధేశ్యామ్ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ఆదిపురుష్తో పాటు నాగ్ అశ్విన్ సినిమా రెండూ కూడా భారీ ప్రాజెక్టులే. ప్రభాస్ ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికే రెండు మూడేళ్ల సమయం పట్టేలా ఉంది.
ఇంతలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త సినిమా కమిటయ్యాడని, దీని గురించే హోంబలె ఫిలిమ్స్ ప్రకటన చేయబోతోందని వార్తలొస్తున్నాయి. ఐతే ప్రభాస్కు ఇప్పుడింత తొందరేంటి అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఐతే ప్రశాంత్ ప్రపోజల్ నచ్చే అతను ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రశాంత్-ప్రభాస్ కలయికలో రాబోయేది కొత్త కథ కాదట. అదొక రీమేక్ అని వార్తలొస్తున్నాయి.
ప్రశాంత్ ఆరేళ్ల కిందట ఉగ్రం అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శ్రీ మురళి అనే చిన్న హీరోతో ప్రశాంత్ తీసిన ఆ సినిమా కన్నడ నాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో సాగే ఆ చిత్రం చాలా ఇంటెన్స్గా ఉంటుంది. కన్నడలో రొడ్డకొట్టుడు సినిమాల మధ్య అది విభిన్న ప్రయత్నంలో ప్రశంసలందుకుంది.
ఈ సినిమాతో వచ్చిన పేరు వల్లే కేజీఎఫ్ లాంటి భారీ సినిమా తీసే అవకాశం దక్కింది ప్రశాంత్కు. ఇప్పుడు ఈ కథను ప్రభాస్తో భారీ స్థాయిలో తీయాలన్నది ప్రశాంత్ ప్రణాళిక అట. ప్రభాస్తో సినిమా అంటే దాని స్కేలే మారిపోతుంది. మూల కథ తీసుకుని దాన్ని పెద్ద రేంజిలో తీసి సినిమాకు కొత్త కలర్ ఇవ్వాలన్నది ప్రశాంత్ ప్రయత్నంలా ఉంది.
కథ రెడీ కాబట్టి తనకు వీలున్నపుడు సినిమా చేద్దామని, ఇది తనకు భిన్నమైన సినిమా అవుతుందని ప్రభాస్ భావిస్తున్నాడట. ఇంతకుముందు చివరగా ప్రభాస్ చేసిన రీమేక్ మూవీ యోగి కూడా కన్నడ నుంచి వచ్చిందే కావడం విశేషం.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…