ఓవైపు రాధేశ్యామ్ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ఆదిపురుష్తో పాటు నాగ్ అశ్విన్ సినిమా రెండూ కూడా భారీ ప్రాజెక్టులే. ప్రభాస్ ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికే రెండు మూడేళ్ల సమయం పట్టేలా ఉంది.
ఇంతలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త సినిమా కమిటయ్యాడని, దీని గురించే హోంబలె ఫిలిమ్స్ ప్రకటన చేయబోతోందని వార్తలొస్తున్నాయి. ఐతే ప్రభాస్కు ఇప్పుడింత తొందరేంటి అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఐతే ప్రశాంత్ ప్రపోజల్ నచ్చే అతను ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రశాంత్-ప్రభాస్ కలయికలో రాబోయేది కొత్త కథ కాదట. అదొక రీమేక్ అని వార్తలొస్తున్నాయి.
ప్రశాంత్ ఆరేళ్ల కిందట ఉగ్రం అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శ్రీ మురళి అనే చిన్న హీరోతో ప్రశాంత్ తీసిన ఆ సినిమా కన్నడ నాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో సాగే ఆ చిత్రం చాలా ఇంటెన్స్గా ఉంటుంది. కన్నడలో రొడ్డకొట్టుడు సినిమాల మధ్య అది విభిన్న ప్రయత్నంలో ప్రశంసలందుకుంది.
ఈ సినిమాతో వచ్చిన పేరు వల్లే కేజీఎఫ్ లాంటి భారీ సినిమా తీసే అవకాశం దక్కింది ప్రశాంత్కు. ఇప్పుడు ఈ కథను ప్రభాస్తో భారీ స్థాయిలో తీయాలన్నది ప్రశాంత్ ప్రణాళిక అట. ప్రభాస్తో సినిమా అంటే దాని స్కేలే మారిపోతుంది. మూల కథ తీసుకుని దాన్ని పెద్ద రేంజిలో తీసి సినిమాకు కొత్త కలర్ ఇవ్వాలన్నది ప్రశాంత్ ప్రయత్నంలా ఉంది.
కథ రెడీ కాబట్టి తనకు వీలున్నపుడు సినిమా చేద్దామని, ఇది తనకు భిన్నమైన సినిమా అవుతుందని ప్రభాస్ భావిస్తున్నాడట. ఇంతకుముందు చివరగా ప్రభాస్ చేసిన రీమేక్ మూవీ యోగి కూడా కన్నడ నుంచి వచ్చిందే కావడం విశేషం.
This post was last modified on December 1, 2020 9:18 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…