మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల వివాహం సందర్భంగా మెగా హీరోలందరూ డిసెంబర్ నెలలో షూటింగులకు ఎగనామం పెడుతున్నారు. చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ జనవరిలోనే మొదలు పెట్టాలని డిసైడ్ కాగా, రామ్ చరణ్ కూడా రాజమౌళిని అడిగి సంక్రాంతి వరకు సెలవులు తీసుకున్నాడట.
వరుణ్ తేజ్ తన సినిమా షూటింగులు సంక్రాంతి తర్వాత మొదలు పెట్టాలని ఫిక్సయ్యాడు. పవన్ కళ్యాణ్ పెళ్లి కోసం వెళ్లేది ఒక్క రోజే అయినా కానీ అంతవరకు షూటింగ్కి అయితే హాజరు కారాదని నిర్ణయించుకున్నాడు. అల్లు అర్జున్ కూడా పుష్ప షూటింగ్కి కొద్ది రోజుల విరామం ఇచ్చి పెళ్లికొచ్చి తర్వాత మళ్లీ అడవులకి వెళతాడు.
సాయి ధరమ్ తేజ్ కూడా కొత్త సినిమాను జనవరిలోనే మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. కరోనా లాక్డౌన్ టైమ్లోనే పెళ్లయిపోయి వుంటే మెగా హీరోలంతా అందుబాటులో వుండేవారు. కానీ ఇప్పుడు నెల రోజులకు పైగా సెలవులతో ఇంత మంది హీరోలు ఒకేసారి అందుబాటులో లేకపోవడంతో పలు చిత్రాల షూటింగులు నిలిచిపోతాయి. ఎలాగో వచ్చే ఏడాది సినిమాల విడుదల తేదీల విషయంలో అనిశ్చితి నెలకొంది కనుక ఎవరూ అంత ఒత్తిడికి లోనవడం లేదు.
This post was last modified on December 1, 2020 4:52 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…