మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల వివాహం సందర్భంగా మెగా హీరోలందరూ డిసెంబర్ నెలలో షూటింగులకు ఎగనామం పెడుతున్నారు. చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ జనవరిలోనే మొదలు పెట్టాలని డిసైడ్ కాగా, రామ్ చరణ్ కూడా రాజమౌళిని అడిగి సంక్రాంతి వరకు సెలవులు తీసుకున్నాడట.
వరుణ్ తేజ్ తన సినిమా షూటింగులు సంక్రాంతి తర్వాత మొదలు పెట్టాలని ఫిక్సయ్యాడు. పవన్ కళ్యాణ్ పెళ్లి కోసం వెళ్లేది ఒక్క రోజే అయినా కానీ అంతవరకు షూటింగ్కి అయితే హాజరు కారాదని నిర్ణయించుకున్నాడు. అల్లు అర్జున్ కూడా పుష్ప షూటింగ్కి కొద్ది రోజుల విరామం ఇచ్చి పెళ్లికొచ్చి తర్వాత మళ్లీ అడవులకి వెళతాడు.
సాయి ధరమ్ తేజ్ కూడా కొత్త సినిమాను జనవరిలోనే మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. కరోనా లాక్డౌన్ టైమ్లోనే పెళ్లయిపోయి వుంటే మెగా హీరోలంతా అందుబాటులో వుండేవారు. కానీ ఇప్పుడు నెల రోజులకు పైగా సెలవులతో ఇంత మంది హీరోలు ఒకేసారి అందుబాటులో లేకపోవడంతో పలు చిత్రాల షూటింగులు నిలిచిపోతాయి. ఎలాగో వచ్చే ఏడాది సినిమాల విడుదల తేదీల విషయంలో అనిశ్చితి నెలకొంది కనుక ఎవరూ అంత ఒత్తిడికి లోనవడం లేదు.
This post was last modified on December 1, 2020 4:52 pm
టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పార్టీ సీనియర్లకు.. పరోక్షంగా ఓ విషయాన్ని తేల్చి చెప్పేశారు. కూటమి విషయంలోనూ.. ముఖ్యంగా జనసేన-టీడీపీ…
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…