లవ్, ఫ్రెండ్ షిప్స్ ఆధారంగా చేసుకుని సెన్సిబుల్ సినిమాలు ఇస్తాడని పేరున్న దర్శకుడు కిషోర్ తిరుమల కొత్త మూవీ రవితేజతో తీస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చాలా అంటే చాలా వేగంగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి స్లాట్ మిస్ కాకూడదని కంకణం కట్టుకుని మరీ పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఇటీవలే రవితేజ మాస్ జాతర దారుణంగా ఫెయిలైన నేపథ్యంలో అంచనాల పరంగా ఇప్పుడా బరువంతా కిషోర్ తిరుమల మీదే పడుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ ని దాదాపు ఖరారు చేసిన ఈ ఎంటర్ టైనర్ కు మళ్ళీ భీమ్స్ సిసిరోలియోనే సంగీతం సమకూర్చడం విశేషం.
ఇక్కడ తిరుమల కిషోర్ ముందు కొన్ని సవాళ్లున్నాయి. మొదటిది రవితేజకు హిట్ ఇవ్వడం. రెండోది తీసుకున్నది వినోదాత్మక కాన్సెప్ట్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోవడం. అందుకే ధమాకా తరహాలో ఒక మంచి జోష్ ఇచ్చే సాంగ్ ఇందులో పెట్టారని ఇన్ సైడ్ టాక్. పాపులర్ టీవీ సీరియల్స్ పాటలను తీసుకుని వాటిని రీమిక్స్ చేయించి కొత్త ప్రయోగం ఏదో చేశారట. ఇది కిషోర్ తిరుమల స్టైల్ కి భిన్నం. అయినా ఎందుకంటే రవితేజ హీరో కాబట్టి ఇలాంటి జోడింపులు తప్పనిసరి. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగే పాత్రలో ఇండియా, ఫారిన్ రెండు చోట్ల కథ జరిగేలా కొంచెం డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఉంటుందట.
ఇక అసలైన మరో ఛాలెంజ్ తీవ్రంగా ఉన్న పోటీలో ఈ సినిమాని గెలిపించుకోవడం. కాంపిటీషన్ మాములుగా లేదు. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, జన నాయకుడు, పరాశక్తితో పోటీ చాలా టఫ్ గా ఉంది. అసలే రవితేజ వరస డిజాస్టర్ల తర్వాత ఈ సినిమాతో వస్తున్నాడు. అలాంటప్పుడు సోలోగా అయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇది సంక్రాంతి బొమ్మని బలంగా నమ్ముతున్న హీరో నిర్మాత ఈ అవకాశాన్ని వదలుకునే ఆలోచనలో లేరట. దర్శకుడిగా కిషోర్ తిరుమల గత చిత్రం ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఫెయిలయ్యింది. ఈ గాయం కూడా భర్త మహాశయులే తీర్చాలి.
This post was last modified on November 7, 2025 7:11 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…