లవ్, ఫ్రెండ్ షిప్స్ ఆధారంగా చేసుకుని సెన్సిబుల్ సినిమాలు ఇస్తాడని పేరున్న దర్శకుడు కిషోర్ తిరుమల కొత్త మూవీ రవితేజతో తీస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చాలా అంటే చాలా వేగంగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి స్లాట్ మిస్ కాకూడదని కంకణం కట్టుకుని మరీ పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఇటీవలే రవితేజ మాస్ జాతర దారుణంగా ఫెయిలైన నేపథ్యంలో అంచనాల పరంగా ఇప్పుడా బరువంతా కిషోర్ తిరుమల మీదే పడుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ ని దాదాపు ఖరారు చేసిన ఈ ఎంటర్ టైనర్ కు మళ్ళీ భీమ్స్ సిసిరోలియోనే సంగీతం సమకూర్చడం విశేషం.
ఇక్కడ తిరుమల కిషోర్ ముందు కొన్ని సవాళ్లున్నాయి. మొదటిది రవితేజకు హిట్ ఇవ్వడం. రెండోది తీసుకున్నది వినోదాత్మక కాన్సెప్ట్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోవడం. అందుకే ధమాకా తరహాలో ఒక మంచి జోష్ ఇచ్చే సాంగ్ ఇందులో పెట్టారని ఇన్ సైడ్ టాక్. పాపులర్ టీవీ సీరియల్స్ పాటలను తీసుకుని వాటిని రీమిక్స్ చేయించి కొత్త ప్రయోగం ఏదో చేశారట. ఇది కిషోర్ తిరుమల స్టైల్ కి భిన్నం. అయినా ఎందుకంటే రవితేజ హీరో కాబట్టి ఇలాంటి జోడింపులు తప్పనిసరి. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగే పాత్రలో ఇండియా, ఫారిన్ రెండు చోట్ల కథ జరిగేలా కొంచెం డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఉంటుందట.
ఇక అసలైన మరో ఛాలెంజ్ తీవ్రంగా ఉన్న పోటీలో ఈ సినిమాని గెలిపించుకోవడం. కాంపిటీషన్ మాములుగా లేదు. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, జన నాయకుడు, పరాశక్తితో పోటీ చాలా టఫ్ గా ఉంది. అసలే రవితేజ వరస డిజాస్టర్ల తర్వాత ఈ సినిమాతో వస్తున్నాడు. అలాంటప్పుడు సోలోగా అయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇది సంక్రాంతి బొమ్మని బలంగా నమ్ముతున్న హీరో నిర్మాత ఈ అవకాశాన్ని వదలుకునే ఆలోచనలో లేరట. దర్శకుడిగా కిషోర్ తిరుమల గత చిత్రం ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఫెయిలయ్యింది. ఈ గాయం కూడా భర్త మహాశయులే తీర్చాలి.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…