ఎఫ్ 2 చిత్రం అంత పెద్ద హిట్ అవుతుందని దిల్ రాజు అప్పుడనుకోలేదు. అందులో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా అంత రెవెన్యూ ఊహించలేదు. అందుకే ఆ చిత్రంలో నటించడానికి వెంకీ ఆరు కోట్లు, వరుణ్ మూడు కోట్లు మాత్రం తీసుకున్నారు. కానీ దాని సీక్వెల్ చేయడానికి మాత్రం వెంకీ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్నాడు.
వెంకటేష్కి ఎంత ఇస్తే తనకూ అంతే ఇవ్వాలని వరుణ్ తేజ్ పట్టుబట్టాడు. వెంకటేష్కి వాటాల ప్రకారం పన్నెండు కోట్లు ఇవ్వాల్సి వస్తుందట. అంత మొత్తం వరుణ్ తేజ్కీ ఇవ్వాలంటే దిల్ రాజుకి బడ్జెట్ కంట్రోల్లో వుండదనే భయం పట్టుకుంది. పైగా అనిల్ రావిపూడి రేంజ్ కూడా పెరిగిందిపుడు. అందుకే ఈ చిత్రానికి ముగ్గురికీ చెరో పది కోట్లు ఇవ్వడానికి దిల్ రాజు ఓకే అన్నాడట.
అటుపై లాభాలు బాగా వస్తే కొంత షేర్ ఇస్తానని మాట ఇచ్చాడట. అసలే కరోనా వల్ల దిల్ రాజు చాలా నష్టపోయాడు. అందుకే ఇప్పుడు అయిదారు కోట్ల దగ్గర కూడా కాస్త గట్టిగానే వుంటున్నాడు. దిల్ రాజు ఇచ్చిన డీల్కి హీరోలిద్దరూ ఓకే చెప్తే వచ్చే జనవరిలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. సమ్మర్కి ఫినిష్ చేసి మే లేదా జూన్లో విడుదల చేసేసేలా ప్రణాళిక వేసుకున్నారు.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…