ఎఫ్ 2 చిత్రం అంత పెద్ద హిట్ అవుతుందని దిల్ రాజు అప్పుడనుకోలేదు. అందులో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా అంత రెవెన్యూ ఊహించలేదు. అందుకే ఆ చిత్రంలో నటించడానికి వెంకీ ఆరు కోట్లు, వరుణ్ మూడు కోట్లు మాత్రం తీసుకున్నారు. కానీ దాని సీక్వెల్ చేయడానికి మాత్రం వెంకీ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్నాడు.
వెంకటేష్కి ఎంత ఇస్తే తనకూ అంతే ఇవ్వాలని వరుణ్ తేజ్ పట్టుబట్టాడు. వెంకటేష్కి వాటాల ప్రకారం పన్నెండు కోట్లు ఇవ్వాల్సి వస్తుందట. అంత మొత్తం వరుణ్ తేజ్కీ ఇవ్వాలంటే దిల్ రాజుకి బడ్జెట్ కంట్రోల్లో వుండదనే భయం పట్టుకుంది. పైగా అనిల్ రావిపూడి రేంజ్ కూడా పెరిగిందిపుడు. అందుకే ఈ చిత్రానికి ముగ్గురికీ చెరో పది కోట్లు ఇవ్వడానికి దిల్ రాజు ఓకే అన్నాడట.
అటుపై లాభాలు బాగా వస్తే కొంత షేర్ ఇస్తానని మాట ఇచ్చాడట. అసలే కరోనా వల్ల దిల్ రాజు చాలా నష్టపోయాడు. అందుకే ఇప్పుడు అయిదారు కోట్ల దగ్గర కూడా కాస్త గట్టిగానే వుంటున్నాడు. దిల్ రాజు ఇచ్చిన డీల్కి హీరోలిద్దరూ ఓకే చెప్తే వచ్చే జనవరిలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. సమ్మర్కి ఫినిష్ చేసి మే లేదా జూన్లో విడుదల చేసేసేలా ప్రణాళిక వేసుకున్నారు.
This post was last modified on December 1, 2020 5:00 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…