జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ తిరిగి మొదలుకాబోతోంది. ఆ మధ్య వేరొక సినిమా గురించి వచ్చిన పుకార్లను దీనికి అన్వయించుకున్న కొందరు నెటిజెన్లు సోషల్ మీడియాలో హడావిడి చేశారు కానీ తర్వాత అసలు నిజం తెలిసి సైలెంటయ్యారు. అయితే డ్రాగన్ ని రెండు భాగాలుగా ప్రశాంత్ నీల్ తీయాలని నిర్ణయించుకున్నట్టు ఒక అనఫీషియల్ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటిదాకా షూట్ చేసింది పార్ట్ 2 లో వస్తుందని, మొదటి భాగానికి సంబంధించిన కంటెంట్ ని కొత్త షెడ్యూల్, కొత్త గెటప్ లో తీయబోతున్నారని సమాచారం.
ఇది బాగానే ఉంది అక్కడ దేవర 2 కోసం వెయిటింగ్ లో ఉన్న దర్శకుడు కొరటాల శివ సర్వం సిద్ధం చేసుకుని ఉన్నారు. తారక్ రావడం ఆలస్యం వేగంగా పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు రెడీ అయ్యాయి. కాకపోతే ఫైనల్ గా ఓకే అనుకుంటే ఆర్టిస్టుల కాల్ షీట్లు తీసుకోవాలి. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇలా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది కాబట్టి ఇలా అనుకోగానే అలా డేట్లు దొరకవు. ఎంతలేదన్నా ఆరు నెలల ముందే ప్లానింగ్ ఉండాలి. పైగా తారాగణమంతా చాలా బిజీగా ఉన్నారు. ముందస్తుగా చెప్పకుండా అప్పటికప్పుడు కాల్ షీట్లు ఇవ్వమంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.
దేవర 2 ఉంటుందా లేదా అనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే తారక్ పుట్టినరోజుకు పోస్టర్ తో పాటు కన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి కొరటాల శివ ఒకవేళ ఆలస్యమయ్యే పక్షంలో ఇంకో సినిమా తీస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికి దర్శకత్వం కాకుండా తన నిర్మాణంలో కొన్ని సినిమాలు తీసేందుకు ప్లానింగ్ లో ఉన్నట్టు సమాచారం. వాటిలో నాగచైతన్యది కూడా ఉందట. కాకపోతే ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. బాహుబలి, కెజిఎఫ్, పుష్ప లాగా సీక్వెల్స్ ఏవైనా సరే రెండు మూడేళ్ళలోపే వచ్చేయాలి. లేదంటే మొదటి భాగం బజ్ తగ్గిపోయే రిస్క్ ఉంటుంది. మరి దేవర 2 ఎప్పుడు సెట్స్ లో అడుగు పెడతాడో చూడాలి.
This post was last modified on November 7, 2025 10:29 am
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…