జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ తిరిగి మొదలుకాబోతోంది. ఆ మధ్య వేరొక సినిమా గురించి వచ్చిన పుకార్లను దీనికి అన్వయించుకున్న కొందరు నెటిజెన్లు సోషల్ మీడియాలో హడావిడి చేశారు కానీ తర్వాత అసలు నిజం తెలిసి సైలెంటయ్యారు. అయితే డ్రాగన్ ని రెండు భాగాలుగా ప్రశాంత్ నీల్ తీయాలని నిర్ణయించుకున్నట్టు ఒక అనఫీషియల్ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటిదాకా షూట్ చేసింది పార్ట్ 2 లో వస్తుందని, మొదటి భాగానికి సంబంధించిన కంటెంట్ ని కొత్త షెడ్యూల్, కొత్త గెటప్ లో తీయబోతున్నారని సమాచారం.
ఇది బాగానే ఉంది అక్కడ దేవర 2 కోసం వెయిటింగ్ లో ఉన్న దర్శకుడు కొరటాల శివ సర్వం సిద్ధం చేసుకుని ఉన్నారు. తారక్ రావడం ఆలస్యం వేగంగా పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు రెడీ అయ్యాయి. కాకపోతే ఫైనల్ గా ఓకే అనుకుంటే ఆర్టిస్టుల కాల్ షీట్లు తీసుకోవాలి. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇలా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది కాబట్టి ఇలా అనుకోగానే అలా డేట్లు దొరకవు. ఎంతలేదన్నా ఆరు నెలల ముందే ప్లానింగ్ ఉండాలి. పైగా తారాగణమంతా చాలా బిజీగా ఉన్నారు. ముందస్తుగా చెప్పకుండా అప్పటికప్పుడు కాల్ షీట్లు ఇవ్వమంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.
దేవర 2 ఉంటుందా లేదా అనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే తారక్ పుట్టినరోజుకు పోస్టర్ తో పాటు కన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి కొరటాల శివ ఒకవేళ ఆలస్యమయ్యే పక్షంలో ఇంకో సినిమా తీస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికి దర్శకత్వం కాకుండా తన నిర్మాణంలో కొన్ని సినిమాలు తీసేందుకు ప్లానింగ్ లో ఉన్నట్టు సమాచారం. వాటిలో నాగచైతన్యది కూడా ఉందట. కాకపోతే ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. బాహుబలి, కెజిఎఫ్, పుష్ప లాగా సీక్వెల్స్ ఏవైనా సరే రెండు మూడేళ్ళలోపే వచ్చేయాలి. లేదంటే మొదటి భాగం బజ్ తగ్గిపోయే రిస్క్ ఉంటుంది. మరి దేవర 2 ఎప్పుడు సెట్స్ లో అడుగు పెడతాడో చూడాలి.
This post was last modified on November 7, 2025 10:29 am
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…