జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ తిరిగి మొదలుకాబోతోంది. ఆ మధ్య వేరొక సినిమా గురించి వచ్చిన పుకార్లను దీనికి అన్వయించుకున్న కొందరు నెటిజెన్లు సోషల్ మీడియాలో హడావిడి చేశారు కానీ తర్వాత అసలు నిజం తెలిసి సైలెంటయ్యారు. అయితే డ్రాగన్ ని రెండు భాగాలుగా ప్రశాంత్ నీల్ తీయాలని నిర్ణయించుకున్నట్టు ఒక అనఫీషియల్ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటిదాకా షూట్ చేసింది పార్ట్ 2 లో వస్తుందని, మొదటి భాగానికి సంబంధించిన కంటెంట్ ని కొత్త షెడ్యూల్, కొత్త గెటప్ లో తీయబోతున్నారని సమాచారం.
ఇది బాగానే ఉంది అక్కడ దేవర 2 కోసం వెయిటింగ్ లో ఉన్న దర్శకుడు కొరటాల శివ సర్వం సిద్ధం చేసుకుని ఉన్నారు. తారక్ రావడం ఆలస్యం వేగంగా పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు రెడీ అయ్యాయి. కాకపోతే ఫైనల్ గా ఓకే అనుకుంటే ఆర్టిస్టుల కాల్ షీట్లు తీసుకోవాలి. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇలా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది కాబట్టి ఇలా అనుకోగానే అలా డేట్లు దొరకవు. ఎంతలేదన్నా ఆరు నెలల ముందే ప్లానింగ్ ఉండాలి. పైగా తారాగణమంతా చాలా బిజీగా ఉన్నారు. ముందస్తుగా చెప్పకుండా అప్పటికప్పుడు కాల్ షీట్లు ఇవ్వమంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.
దేవర 2 ఉంటుందా లేదా అనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే తారక్ పుట్టినరోజుకు పోస్టర్ తో పాటు కన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి కొరటాల శివ ఒకవేళ ఆలస్యమయ్యే పక్షంలో ఇంకో సినిమా తీస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికి దర్శకత్వం కాకుండా తన నిర్మాణంలో కొన్ని సినిమాలు తీసేందుకు ప్లానింగ్ లో ఉన్నట్టు సమాచారం. వాటిలో నాగచైతన్యది కూడా ఉందట. కాకపోతే ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. బాహుబలి, కెజిఎఫ్, పుష్ప లాగా సీక్వెల్స్ ఏవైనా సరే రెండు మూడేళ్ళలోపే వచ్చేయాలి. లేదంటే మొదటి భాగం బజ్ తగ్గిపోయే రిస్క్ ఉంటుంది. మరి దేవర 2 ఎప్పుడు సెట్స్ లో అడుగు పెడతాడో చూడాలి.
This post was last modified on November 7, 2025 10:29 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…