జైలర్ 2లో బాలకృష్ణ ప్రత్యేక క్యామియో చేస్తారనేది పాత వార్త. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మొదటి భాగంలోనే నటింపజేయడానికి ప్రయత్నించారు కానీ సఫలీకృతం కాలేదు. కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ ని తెచ్చినట్టే తెలుగు నుంచి బాలయ్య ఉంటే బ్యాలన్స్ అవుతుందని అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల నెరవేరలేదు. కట్ చేస్తే జైలర్ 2లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించే స్పెషల్ క్యారెక్టర్ ని బాలకృష్ణతో చేయిస్తారనే ప్రచారం నెలల క్రితమే జరిగింది. కానీ బాలయ్య సున్నితంగా నో చెప్పినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దానికి ప్రత్యేకమైన కారణాలున్నాయి.
రజనీకాంత్, బాలకృష్ణల మధ్య మంచి స్నేహం ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం ప్రదర్శించే తలైవర్ ఈ కారణంగానే శతజయంతి ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా వచ్చారు. అయితే జైలర్ 2లో డిజైన్ చేసిన పాత్ర బాలయ్యని ఎలివేట్ చేయడం కన్నా రజని క్యారెక్టర్ ని హైలైట్ చేసే విధంగా ఉండటంతో వద్దనుకున్నారని ఇన్ సైడ్ టాక్. అఖండ నుంచి డాకు మహారాజ్ దాకా అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న టైంలో క్యామియోలు లాంటివి వద్దని ఆయన కూతురు తేజస్విని సలహా ఇవ్వడం వల్లే ఈ డెసిషన్ తీసుకున్నట్టు చెబుతున్నారు. నిజమెంతో కానీ ఒకరకంగా ఇది సరైన నిర్ణయమే.
ఎందుకంటే ఫస్ట్ జైలర్ లో అతిధి పాత్రలు రజనిని ఎలివేట్ చేయడానికే ఎక్కువ ఉపయోగపడ్డాయి. కానీ బాలకృష్ణ అలా చేస్తే అభిమానులు అంత సులభంగా అంగీకరించకపోవచ్చు. గతంలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా లాంటివి చేసిన బాలయ్య దానికి తగ్గ ఫలితం అందుకోలేకపోవడంతో క్యామియోలకు దూరంగా ఉన్నారు. అందుకే జైలర్ 2కి నో చెప్పి ఉండొచ్చని టాక్. ఆయన స్థానంలో ఫహద్ ఫాసిల్ ని తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అతను ఉన్న మాట నిజమే కానీ అది బాలయ్య వద్దని చెప్పిన పాత్ర కోసమా లేక మరొకటా అనేది తెలియాల్సి ఉంది. 2026 వేసవి రిలీజ్ టార్గెట్ గా జైలర్ 2 పనులు జరుగుతున్నాయి.
This post was last modified on November 5, 2025 11:12 am
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…