టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్ రాజా రవితేజ. మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత స్ఫూర్తిదాయక ఎదుగుదల రవితేజదే. ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, విక్రమార్కుడు, కిక్ సహా ఎన్నో బ్లాక్బస్టర్లు ఉన్నాయి రవితేజ కెరీర్లో. కానీ గత దశాబ్ద కాలంలో ఆయన సక్సెస్ రేట్ బాగా తగ్గిపోయింది. రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా.. ఈ మూడు తప్పితే గత పదేళ్లలో రవితేజ సినిమాలన్నీ డిజాస్టర్లే అయ్యాయి.
రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్.. ఇలా రెండేళ్లలో నాలుగు ఫ్లాపులను ఖాతాలో వేసుకున్న మాస్ రాజా.. తాజాగా ‘మాస్ జాతర’తో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ సినిమా కూడా ఆయన ఆశలను నిలబెట్టలేదు. గత చిత్రాల కంటే దారుణమైన ఫలితాన్నందుకుంది. వీకెండ్లో కూడా సరిగా పెర్ఫామ్ చేయలేకపోయిన ‘మాస్ జాతర’.. సోమవారం నుంచి పూర్తిగా వాషౌట్ అయిపోయింది.
‘ఈగల్’ లాంటి డిఫరెంట్ సినిమాలు తీస్తే ఫలితం ఉండట్లేదని.. తన మార్కు మాస్ సినిమాలు ట్రై చేసినా రవితేజకు అస్సలు కలిసి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో రవితేజ దృష్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీదికి మళ్లింది. ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ లాంటి మంచి సినిమాలు తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ సైలెంటుగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇది రవితేజ ఇమేజ్కు కొంచెం భిన్నమైన సినిమానే.
ఇది కొత్త రకం సినిమా అని చెప్పలేం కానీ.. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రవితేజను చూడడం మాత్రం కొత్తే. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాతో గట్టి ఎదురు దెబ్బ తిన్న కిషోర్ తిరుమల.. బాగా టైం తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడు. తనకూ పెద్ద హిట్ అవసరమైన స్థితిలో రవితేజకూ అతను ఓ మంచి విజయాన్ని అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి షెడ్యూల్ చేశారు కానీ.. అప్పుడు రావడం డౌటే అంటున్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో సినిమా రిలీజ్ కావచ్చు. ఎప్పుడు వచ్చినా ఈ చిత్రంతో రవితేజ హిట్ కొట్టి తీరాల్సిందే. లేదంటే ఆయన మార్కెట్ మరింత డౌన్ అయిపోతుంది.
This post was last modified on November 4, 2025 6:39 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…