రీ రిలీజుల్లో సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన బాహుబలి ది ఎపిక్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు ట్రేడ్ టాక్. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహాయించి మిగిలిన చోట్ల మూడు రోజులు బాగా వసూళ్లు రాబట్టి సడన్ గా డౌన్ అయినట్టు లెక్కలు చెబుతున్నాయి. రెండు భాగాలు ఒకేసారి చూడాలని ఎదురు చూసిన మూవీ లవర్స్ తమ కోరికను మూడు రోజుల్లోనే తీర్చేసుకున్నారు. చాలా చోట్ల శని ఆదివారాలు హౌస్ ఫుల్స్ పడ్డాయి. మాస్ జాతర కన్నా మంచి నెంబర్లు బాహుబలి ఎపిక్ కే నమోదయ్యాయి. అయితే ఫ్యాన్స్ ఆశించింది, లెక్క వేసుకుంది వేరు.
కనీసం యాభై నుంచి వంద కోట్ల మధ్యలో ఫైనల్ గ్రాస్ నమోదవుతుందని అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే అది నెరవేరడం సాధ్యపడేలా లేదు. ఎందుకంటే ఎంత ఎపిక్ అయినా కామన్ ఆడియన్స్ ఈ సినిమాని కొన్ని వందలసార్లు టీవీలో ఫోన్ లో చూసేశారు. ప్రతి ఒక్కరు మళ్ళీ ఎపిక్ కోసం థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు. సో వంద కోట్లు అనేది చాలా పెద్ద మాట. బయ్యర్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇండియా వైడ్ ముప్పై కోట్లు, ఓవర్సీస్ పది కోట్లు వసూలు చేసిన బాహుబలి ఎపిక్ ఇప్పటిదాకా నలభై కోట్లకు పైగా తన ఖాతాలో వేసుకున్నట్టు తెలిసింది. ఈ వారంలో హాఫ్ సెంచరీ మార్కు చేరుకుంటుందేమో చూడాలి.
కొన్ని చోట్ల మాత్రం బాహుబలి ఎపిక్ కి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. ఉదాహరణకు ప్రసాద్ మల్టీప్లెక్సులో వారం కాకుండానే ముప్పై వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అల్లు అర్జున్ ఏఏఏ సముదాయంలో ఎల్ఈడి స్క్రీన్ లో వేస్తున్న షోలకు టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. రవితేజ ఏఆర్టి ఎపిక్ స్క్రీన్ డిమాండ్ సైతం ఇదే స్థాయిలో ఉంది. అయితే ఏపీ తెలంగాణ మొత్తం ఇలాంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనా బాహుబలి ఎపిక్ సరికొత్త రికార్డులు నమోదు చేసిన మాట వాస్తవం. దీని హడావిడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ 15 జరగబోయే ఎస్ఎస్ఎంబి 29 లాంచ్ వైపు వెళ్తోంది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…