రీ రిలీజుల్లో సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన బాహుబలి ది ఎపిక్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు ట్రేడ్ టాక్. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహాయించి మిగిలిన చోట్ల మూడు రోజులు బాగా వసూళ్లు రాబట్టి సడన్ గా డౌన్ అయినట్టు లెక్కలు చెబుతున్నాయి. రెండు భాగాలు ఒకేసారి చూడాలని ఎదురు చూసిన మూవీ లవర్స్ తమ కోరికను మూడు రోజుల్లోనే తీర్చేసుకున్నారు. చాలా చోట్ల శని ఆదివారాలు హౌస్ ఫుల్స్ పడ్డాయి. మాస్ జాతర కన్నా మంచి నెంబర్లు బాహుబలి ఎపిక్ కే నమోదయ్యాయి. అయితే ఫ్యాన్స్ ఆశించింది, లెక్క వేసుకుంది వేరు.
కనీసం యాభై నుంచి వంద కోట్ల మధ్యలో ఫైనల్ గ్రాస్ నమోదవుతుందని అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే అది నెరవేరడం సాధ్యపడేలా లేదు. ఎందుకంటే ఎంత ఎపిక్ అయినా కామన్ ఆడియన్స్ ఈ సినిమాని కొన్ని వందలసార్లు టీవీలో ఫోన్ లో చూసేశారు. ప్రతి ఒక్కరు మళ్ళీ ఎపిక్ కోసం థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు. సో వంద కోట్లు అనేది చాలా పెద్ద మాట. బయ్యర్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇండియా వైడ్ ముప్పై కోట్లు, ఓవర్సీస్ పది కోట్లు వసూలు చేసిన బాహుబలి ఎపిక్ ఇప్పటిదాకా నలభై కోట్లకు పైగా తన ఖాతాలో వేసుకున్నట్టు తెలిసింది. ఈ వారంలో హాఫ్ సెంచరీ మార్కు చేరుకుంటుందేమో చూడాలి.
కొన్ని చోట్ల మాత్రం బాహుబలి ఎపిక్ కి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. ఉదాహరణకు ప్రసాద్ మల్టీప్లెక్సులో వారం కాకుండానే ముప్పై వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అల్లు అర్జున్ ఏఏఏ సముదాయంలో ఎల్ఈడి స్క్రీన్ లో వేస్తున్న షోలకు టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. రవితేజ ఏఆర్టి ఎపిక్ స్క్రీన్ డిమాండ్ సైతం ఇదే స్థాయిలో ఉంది. అయితే ఏపీ తెలంగాణ మొత్తం ఇలాంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనా బాహుబలి ఎపిక్ సరికొత్త రికార్డులు నమోదు చేసిన మాట వాస్తవం. దీని హడావిడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ 15 జరగబోయే ఎస్ఎస్ఎంబి 29 లాంచ్ వైపు వెళ్తోంది.
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…