తమ సినిమాల గురించి పాజిటివ్గా మాట్లాడ్డం వరకు ఓకే. కొంచెం ఎగ్జాజరేట్ చేసి కూడా చెప్పుకోవచ్చు. కానీ అత్యుత్సాహంతో భారీ స్టేట్మెంట్లు ఇస్తేనే చాలా కష్టమవుతుంది. రిలీజ్కు ముందు అలాంటి స్టేట్మెంట్లు సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ను తెలియజేయొచ్చు. ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి రేకెత్తించవచ్చు. కానీ ఏదైనా తేడా కొడితే.. డ్యామేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆ కామెంట్లు ట్రోల్ మెటీరియల్గా మారతాయి. సినిమాకు చేటు చేస్తాయి.
ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ‘మాస్ జాతర’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఆయనకు తలనొప్పిగా మారేలా ఉంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు షాక్ కాకపోతే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఐతే రాజేంద్ర ప్రసాద్ పాజిటివ్ కోణంలో ‘షాక్’ అవుతారు అంటే.. ఆడియన్స్ ఇంకో రకంగా షాకయ్యారు. ఈ రోజుల్లో ఇంత రొటీన్ సినిమా తీసి మెప్పించగలమని ఎలా అనుకున్నారు అనుకుంటూ షాకవుతున్నారు.
అసలు రాజేంద్ర ప్రసాద్ పాత్రలో ఏమంత విషయం ఉందని అంత ఎగ్జైట్ అయ్యారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇలా సినీ జనాలు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి ఇబ్బంది పడడం ఇదే తొలిసారి కాదు. గతంలో విశ్వక్సేన్ ‘పాగల్’ అనే సినిమా గురించి మాట్లాడుతూ.. కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లను కూడా ఈ సినిమా తెరిపిస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ సినిమాకు జనం లేక తొలి వారంలోనే షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
నేచురల్ స్టార్ నాని ‘కోర్టు’ మూవీ గురించి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా నచ్చకపోతే తాను హీరోగా నటించే తర్వాతి సినిమాను చూడొద్దని అన్నాడు. కానీ ఆ సినిమా హిట్టయి నాని మాటకు విలువ చేకూర్చింది. ఐతే కానీ ‘కోర్టు’లో లీడ్ రోల్ చేసిన ప్రియదర్శి.. నానిని అనుకరిస్తూ ‘మిత్రమండలి’ సినిమా విషయంలో సేమ్ ఇలాంటి ఛాలెంజే విసిరాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అందుకే సినిమాకు హైప్ ఇవ్వడం కోసం మరీ పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకపోవడం మంచిది.
This post was last modified on November 2, 2025 7:17 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…