మల్లువుడ్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించి మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లోకా చాప్టర్ 1 నిన్నటి నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం సంగతి పక్కనపెడితే ఎక్కువ శాతం ఇతర బాషల ప్రేక్షకులు దీన్ని థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయలేదు. తెలుగులో నాలుగైదు రోజులు హడావిడి చేసి తర్వాత నెమ్మదించిపోయింది. అందుకే డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూశారు. అయితే లోకాకు అనూహ్యంగా చాలా మిక్స్డ్ టాక్ నడుస్తోంది. అనుకున్నంత గొప్ప లేదని కొందరు, బాగా ఓవర్ రేటెడ్ అని మరికొందరు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నెగటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. థియేటర్ అనుభూతికి టీవీలో చూడ్డానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు కల్కి 2898 ఏడిని తీసుకుంటే స్మార్ట్ స్క్రీన్ లో చూసి పెదవి విరిచిన వాళ్ళున్నారు. కానీ థియేటర్లలో ఎన్ని వందల కోట్లు వసూలు చేసిందో తెలిసిందే. టీవీలో లెక్కలేనన్నిసార్లు చూసిన బాహుబలిని మళ్ళీ బిగ్ స్క్రీన్ కోసం జనం ఎంతగా ఎగబడుతున్నారో వసూళ్ల సాక్షిగా కళ్ళముందు కనిపిస్తోంది. లోక చాప్టర్ 1 ఈ స్థాయి కాకపోయినా జనాన్ని మెప్పించడంలో అయితే సక్సెస్ అయ్యింది. అయితే కేరళ ఆడియన్స్ అభిరుచులకు మన టేస్ట్ కి వ్యత్యాసం ఉన్న సంగతి మర్చిపోకూడదు.
లోకా వాళ్ళకు ఎంతబాగా నచ్చినా మన జనాలకు మాత్రం ఆ స్థాయిలో కనెక్ట్ కాలేదన్నది వాస్తవం. కళ్యాణి ప్రియదర్శన్ కు ఎంత గొప్ప పేరు వచ్చినా ఇతర లాంగ్వేజెస్ లో అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. త్వరలో లోకా చాప్టర్ 2 ప్రారంభించబోతున్నారు. టోవినో థామస్ హీరోగా నటించబోయే ఈ రెండో భాగానికి బడ్జెట్ అమాంతం పెంచేశారు. నిర్మాత దుల్కర్ సల్మాన్ ఎంత ఖర్చయినా సరే ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడట. ఇప్పటికైతే ఈ సిరీస్ లో అయిదు కథలను సిద్ధం చేసినట్టు కోచి రిపోర్ట్. చాప్టర్ 2 ఫలితం కూడా ఇలాగే వస్తే ఓకే కానీ లేదంటే మాత్రం అక్కడితో చరమగీతం పాడేయడం ఖాయం.
This post was last modified on November 1, 2025 11:29 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…