మల్లువుడ్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించి మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లోకా చాప్టర్ 1 నిన్నటి నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం సంగతి పక్కనపెడితే ఎక్కువ శాతం ఇతర బాషల ప్రేక్షకులు దీన్ని థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయలేదు. తెలుగులో నాలుగైదు రోజులు హడావిడి చేసి తర్వాత నెమ్మదించిపోయింది. అందుకే డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూశారు. అయితే లోకాకు అనూహ్యంగా చాలా మిక్స్డ్ టాక్ నడుస్తోంది. అనుకున్నంత గొప్ప లేదని కొందరు, బాగా ఓవర్ రేటెడ్ అని మరికొందరు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నెగటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. థియేటర్ అనుభూతికి టీవీలో చూడ్డానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు కల్కి 2898 ఏడిని తీసుకుంటే స్మార్ట్ స్క్రీన్ లో చూసి పెదవి విరిచిన వాళ్ళున్నారు. కానీ థియేటర్లలో ఎన్ని వందల కోట్లు వసూలు చేసిందో తెలిసిందే. టీవీలో లెక్కలేనన్నిసార్లు చూసిన బాహుబలిని మళ్ళీ బిగ్ స్క్రీన్ కోసం జనం ఎంతగా ఎగబడుతున్నారో వసూళ్ల సాక్షిగా కళ్ళముందు కనిపిస్తోంది. లోక చాప్టర్ 1 ఈ స్థాయి కాకపోయినా జనాన్ని మెప్పించడంలో అయితే సక్సెస్ అయ్యింది. అయితే కేరళ ఆడియన్స్ అభిరుచులకు మన టేస్ట్ కి వ్యత్యాసం ఉన్న సంగతి మర్చిపోకూడదు.
లోకా వాళ్ళకు ఎంతబాగా నచ్చినా మన జనాలకు మాత్రం ఆ స్థాయిలో కనెక్ట్ కాలేదన్నది వాస్తవం. కళ్యాణి ప్రియదర్శన్ కు ఎంత గొప్ప పేరు వచ్చినా ఇతర లాంగ్వేజెస్ లో అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. త్వరలో లోకా చాప్టర్ 2 ప్రారంభించబోతున్నారు. టోవినో థామస్ హీరోగా నటించబోయే ఈ రెండో భాగానికి బడ్జెట్ అమాంతం పెంచేశారు. నిర్మాత దుల్కర్ సల్మాన్ ఎంత ఖర్చయినా సరే ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడట. ఇప్పటికైతే ఈ సిరీస్ లో అయిదు కథలను సిద్ధం చేసినట్టు కోచి రిపోర్ట్. చాప్టర్ 2 ఫలితం కూడా ఇలాగే వస్తే ఓకే కానీ లేదంటే మాత్రం అక్కడితో చరమగీతం పాడేయడం ఖాయం.
This post was last modified on November 1, 2025 11:29 am
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…