‘హనుమాన్’ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్కు శ్రీకారం చుట్టాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాకు ముందు ప్రశాంత్ చిన్న స్థాయి దర్శకుడే. పెద్ద సక్సెస్లేమీ లేవు. దీంతో పోస్టర్ మీద పీవీసీయూ అని చూసి ఇది మరీ అతిగా ఉందే అనుకున్నారు చాలామంది. కానీ ‘హనుమాన్’తో పాన్ ఇండియా బ్లాక్బస్టర్ కొట్టి తనేంటో చూపించాడు ప్రశాంత్. తర్వాత అందరికీ పీవీసీయూ పట్ల అమితాసక్తి వ్యక్తమైంది.
ఐతే ఇందులో భాగంగా మోక్షజ్ఞతో చేయాలనుకున్న సినిమా ముందుకు కదల్లేదు. ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ కూడా ఆలస్యం అవుతోంది. మరి ఈ యూనివర్శ్ ఎప్పుడు ముందుకు కదులుతుందో అని అందరూ చూస్తున్నారు. ఐతే ‘మహాకాలి’ రూపంలో పీవీసీయూలో రెండో సినిమా సెట్స్పైకి వెళ్లిపోతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఇందులో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ క్యూరియాసిటీ పెంచింది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న చిన్నమ్మాయి ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది కూడా క్రేజీగా ఉంది. ‘హనుమాన్’కు ఫాలో అప్గా మరో క్రేజీ ప్రాజెక్టునే రెడీ చేస్తున్నట్లున్నాడు ప్రశాంత్. ఈ సినిమాకు అతను కథకుడు మాత్రమే. దర్శకత్వ బాధ్యతలను పూజ అపర్ణ కొల్లూరుకు అప్పగించారు.
భారీ వీఎఫెక్స్తో విజువల్ వండర్లా తీర్చిదిద్దాలనుకుంటున్న ఇలాంటి సినిమా బాధ్యతలను ఒక చిన్న సినిమా తీసిన, లేడీ డైరెక్టర్ చేతిలో పెట్టడం ఆశ్చర్యమే. పూజ ఇంతకుముందు సంపూ హీరోగా ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా తీసింది. అది తమిళ హిట్ ‘మండేలా’కు రీమేక్. చాలా తక్కువ బడ్జెట్లో తీశారు. మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ ‘మార్టిన్ లూథర్ కింగ్’ బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. అలాంటి సినిమాతో పరిచయం అయిన దర్శకురాలిని నమ్మి పెద్ద బడ్జెట్లో ‘మహాకాళి’ తీస్తున్నారు నిర్మాతలు. ఐతే వెనుక ప్రశాంత్ వర్మ ఉన్నాడనే ధైర్యం నిర్మాతలది కావచ్చు. మరి ఈ సినిమాతో పూజ దర్శకురాలిగా ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…