ఈ రోజుల్లో కొత్త సినిమాల నుంచి అప్డేట్స్, లీక్స్ రాకుండా ఆపడం అంటే చాలా కష్టమైన విషయం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కంటెంట్ బయటికి వచ్చేస్తుంటుంది. ఐతే మిగతా చిత్రాలతో పోలిస్తే రాజమౌళి సినిమాలకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతాయి. అధికారికంగా ప్రకటించే వరకు సినిమా విశేషాలేవీ బయటికి పొక్కకుండా టీంలో అందరికీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అయినా సరే కొన్నిసార్లు అనుకోకుండా లీక్స్ జరుగుతుంటాయి.
మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమా లొకేషన్ నుంచి కొన్ని నెలల ముందు చిన్న వీడియో ఒకటి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే టీంలోని ఎవ్వరి నుంచి సినిమా గురించి ఒక చిన్న విషయం కూడా బయటికి రాలేదు. స్వయంగా రాజమౌళే.. మహేష్ చిత్రం గురించి ఎవ్వరు అడిగినా మాట దాట వేసేస్తున్నాడు. ఇక మిగతా ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఐతే హీరో మహేష్ బాబు తనయుడు గౌతమ్ నుంచి ఏవైనా కొన్ని విశేషాలు బయట పెట్టిద్దామని ఒక మీడియా సంస్థ ప్రయత్నిస్తే.. అతను దండం పెట్టి వెళ్లిపోయాడు.
మహేష్ తనయుడు గౌతమ్.. ప్రస్తుతం యుఎస్లో ఉన్నాడు. అక్కడే చదువుకుంటూ సినిమాల కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ‘బాహుబలి: ది ఎపిక్’ రీ రిలీజ్ నేపథ్యంలో గౌతమ్ వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్లలో ఒకటైన థియేటర్లో షో చూడ్డానికి వెళ్లాడు. ఆ సందర్భంగా అతణ్ని ఒక మీడియా సంస్థ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశాడు. ఇలాంటి స్క్రీన్లో బాహుబలి సినిమా చూడబోతుండడం గురించి అతను చాలా ఎగ్జైట్ అయ్యాడు. తనకు గూస్ బంప్స్ వస్తున్నాయన్నాడు. తెలుగు వాళ్లందరికీ ఇది చాలా స్పెషల్ అన్నాడు.
అంతా అయ్యాక మహేష్ బాబు సినిమా గురించి ప్రశ్నిస్తే.. దాని గురించి మాత్రం అడక్కండి, నేనేమీ మాట్లాడను అంటూ అతను అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇది చూస్తే.. సినిమా విశేషాలేమీ బయటికి పొక్కకుండా తన టీం మెంబర్స్నే కాక వాళ్ల కుటుంబ సభ్యులను సైతం రాజమౌళి భయపెట్టేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on October 30, 2025 5:05 pm
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…