టాలీవుడ్లో ఇప్పుడో ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. విశ్వక్సేన్ హీరోగా నాని నిర్మాణంలో కొత్త దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన ‘హిట్’ సినిమా సీక్వెల్లో శేష్ ప్రధాన పాత్ర పోషించనున్నాడట. విశ్వక్సేన్ అందుబాటులో లేకపోవడమో, మరో కారణంతోనో శేష్ లీడ్ రోల్ను టేకప్ చేయనున్నట్లుగా చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందని చెప్పుకుంటున్నారు. కానీ ఈ వార్త ఎంత వరకు నిజం, ఈ సినిమా శేష్కు కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టాలీవుడ్లో థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న హీరో శేష్. అతను చేసిన ప్రతి థ్రిల్లర్ సినిమా కూడా ఒక సెన్సేషనే. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో అతను ట్రెండ్ సెట్ చేశాడు. తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. అందరూ మన వైపు చూసేలా చేశాడు. ఇప్పుడు అతను చేస్తున్న ‘మేజర్’, ‘గూఢచారి’ సినిమాలు సైతం థ్రిల్లర్ కథలతో తెరకెక్కతున్నవే. వీటి మీదే శేష్ ఫోకస్ అంతా ఉంది. ఇప్పటిదాకా చేసిన, చేయబోయే సినిమాలన్నింట్లో శేష్ ముద్ర ప్రత్యేకమైంది. ఆ సినిమాలకు అన్నీ తానై వ్యవహరించాడు శేష్. ఈ సినిమాల్లో అతడి బ్రాండ్ ఉంది.
ఐతే ‘హిట్’ అనేది వేరే హీరో నటించిన సినిమా. సీక్వెల్కు ఆల్రెడీ స్క్రిప్టు పూర్తయింది. అందులో శేష్ భాగస్వామ్యం ఏమీ లేదు. తనకంటూ ఒక బ్రాండ్ వాల్యూ ఉన్నపుడు వేరే హీరో షూస్లోకి శేష్ దూరాల్సిన అవసరమేంటి అన్నది ప్రశ్న. తాను చేస్తున్న థ్రిల్లర్లు చాలవని ‘హిట్’లోకి కూడా దూరిపోతే జనాలకు మొహం మొత్తేస్తుందేమో.. జనాలు ఆల్రెడీ విశ్వక్సేన్కు అలవాటు పడ్డ నేపథ్యంలో ‘హిట్’ సీక్వెల్ కూడా అతనే చేస్తే భిన్నంగా ఉంటుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా విశ్వక్సేన్ తన కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడే.. తనకో బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టే ‘హిట్’ ఫ్రాంచైజీని ఎందుకు వదులుకున్నాడన్నది అర్థం కాని విషయం. ఏదేమైనా ‘హిట్’ సీక్వెల్లో శేష్ నటించబోతున్నాడనే వార్త అయితే జనాలను అనుకున్నంతగా ఎగ్జైట్ చేయట్లేదు.
This post was last modified on November 30, 2020 2:02 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…