కన్నడ సినిమాలో ఆల్ టైం గ్రేట్ రాజ్ కుమార్ తనయుడిగా అరంగేట్రం చేసి.. అక్కడి టాప్ స్టార్లలో ఒకడిగా ఎదిగిన శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. ఆయన గతంలో రామ్ గోపాల్ వర్మతో కిల్లింగ్ వీరప్పన్ సినిమా చేశారు. ఆపై నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో క్యామియో చేశారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ పెద్దిలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పుడు శివరాజ్ కుమార్ లీడ్ రోల్లో తెలుగులో ఓ సినిమా అనౌన్స్ అయింది. అది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేదే.
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతోంది..అందులో గుమ్మడి నర్సయ్యగా కనిపించబోయేది శివరాజ్కుమారే. ఈ చిత్రానికి పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నాడు. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ లుక్ ఆకట్టుకుంది. మోషన్ పోస్టర్ కాన్సెప్ట్ కూడా బాగుంది. గుమ్మడి నర్సయ్య సాధారణ జీవనాన్ని, ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఈ మోషన్ పోస్టర్ డిజైన్ చేశారు.
పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడిగా గుమ్మడి నర్సయ్యకు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఆయన సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా.. ఆడంబరాలకు పోలేదు. పదవిలో ఉన్నపుడు, ఆ తర్వాత ఆయనది సాధారణ జీవితమే. ఇప్పటికీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు.. మందీ మార్బలం లేకుండా ఒక్కడే జనాల మధ్య తిరుగుతుంటారు. పేదలు, గిరిజనుల కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఇలాంటి నాయకుడి కథను కన్నడ టాప్ స్టార్లలో ఒకడైన శివరాజ్ కుమార్తో తెరకెక్కించనుండడం ఆశ్చర్యం కలిగించేదే.
This post was last modified on October 23, 2025 9:16 am
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…