కాంతార అనే లో బడ్జెట్ రీజనల్ మూవీ.. మూడేళ్ల కిందట దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ కన్నడ చిత్రం.. తర్వాత హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలై ఎవ్వరూ ఊహించని విధంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసి రిలీజ్ చేశారు. ఇది అంచనాలకు తగ్గట్లే ఆడుతోంది. ఇప్పటికే రూ.700 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టింది కాంతార: ది చాప్టర్-1.
ఐతే ఈ ఏడాది ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన ‘ఛావా’ను ‘కాంతార: చాప్టర్-1’ అధిగమిస్తుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. హిందీ మూవీ ‘తామ’ వల్ల ఉత్తరాదిన ‘కాంతార’ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దక్షిణాదిన కూడా సినిమా బాగా స్లో అయ్యాయి. కాబట్టి రూ.800 కోట్ల ఘనతను అందుకోవడం కష్టంగానే ఉంది.
ఐతే 2025 నంబర్ వన్ గ్రాసర్ రికార్డును అందుకోవడం కోసం ‘కాంతార’ మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేశారు.
ఈ చిత్రాన్ని కొత్తగా ఇంగ్లిష్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 31నే ఇంగ్లిష్ వెర్షన్ విడుదల కాబోతోంది. త్వరలో హీరో రిషబ్ శెట్టి అండ్ టీం విదేశాల్లో ఈ సినిమాను ప్రమోట్ చేయబోతున్నారట. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నెట్ఫ్లిక్స్లో నేటివ్ అమెరికన్స్ నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకోవడంతో తర్వాత థియేటర్లలోనూ కొన్ని స్పెషల్ షోలు వేయడం తెలిసిందే. ‘కాంతార’ సైతం అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే పొటెన్షియాలిటీ ఉన్న సినిమా అని టీం భావిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ లాగే ఇది కూడా అక్కడి వాళ్లను ఆకట్టుకుంటే.. ఓవరాల్ వసూళ్లు పెరిగి రూ.800 కోట్ల క్లబ్బులోకి ఈ సినిమా అడుగుపెడుతుందని ఆశిస్తున్నారు.
This post was last modified on October 22, 2025 4:25 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…