సైయారా.. ఈ ఏడాది ఈ బాలీవుడ్ సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక కొత్త హీరో.. ఒక కొత్త హీరోయిన్ కలిసి చేసిన సినిమా రూ.600 కోట్ల వసూళ్లు సాధించడం అంటే ఆషామాషీ విషయమా? ఈ చిత్రం అంత పెద్ద హిట్టవడానికి హృద్యమైన కథాకథనాలకు తోడు లీడ్ రోల్స్ చేసిన ఇద్దరూ అద్భుతంగా పెర్ఫామ్ చేయడం ముఖ్య కారణం. ఇటు అహాన్ పాండే, అటు అనీత్ పడ్డా.. ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అనీత్కు కుర్రాళ్లయితే తమ గుండెల్లో గుడి కట్టేశారు.
తన అందం, అభినయంతో ఆమె అంతగా ఆకట్టుకుంది. ‘సైయారా’ విడుదలకు ముందే అనీత్తో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు ఇంకో మూడు చిత్రాలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు రావడం విశేషం. వేరే ప్రొడక్షన్ హౌస్ల నుంచి కూడా ఆమెకు అవకాశాలు వెల్లువెతాయి. ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ సైతం అనీత్తో ఒక క్రేజీ మూవీ తీయడానికి ప్లాన్ చేసింది.
మ్యాడ్ రాక్ హార్రర్ కామెడీ యూనివర్శ్లో భాగంగా ‘థామా’ చిత్రాన్ని అందించిన మ్యాడ్ డాక్ సంస్థ.. సినిమా చివర్లో ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా విశేషాలను పంచుకుంది. ‘శక్తి షాలిని’ పేరుతో తెరకెక్కుతున్న ఆ చిత్రం.. అనీత్ పడ్డా లీడ్ రోల్ చేయనుంది. ‘థామా’ హిందీ వెర్షన్లో ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ప్రేక్షకులకు క్రేజీగా ఫీలవుతున్నారు.
‘సైయారా’లో చాలా డెలికేట్గా కనిపించిన అనీత్.. హార్రర్ కామెడీలో దయ్యం పాత్ర చేయనుండడం షాకింగే. ఆమె నుంచి తర్వాత ఇలాంటి పాత్రను ఎవ్వరూ ఊహించరు. మ్యాడ్ డాక్ వాళ్ల హార్రర్ కామెడీలంటే ముందే బ్లాక్ బస్టర్ అని ఫిక్సయిపోతున్నారు నార్త్ ఆడియన్స్. ‘థామా’ సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘శక్తి షాలిని’ అనౌన్స్మెంట్లోనే రిలీజ్ డేట్ కూడా ఖరారు చేసింది చిత్ర బృందం. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on October 21, 2025 2:52 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…