సైయారా.. ఈ ఏడాది ఈ బాలీవుడ్ సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక కొత్త హీరో.. ఒక కొత్త హీరోయిన్ కలిసి చేసిన సినిమా రూ.600 కోట్ల వసూళ్లు సాధించడం అంటే ఆషామాషీ విషయమా? ఈ చిత్రం అంత పెద్ద హిట్టవడానికి హృద్యమైన కథాకథనాలకు తోడు లీడ్ రోల్స్ చేసిన ఇద్దరూ అద్భుతంగా పెర్ఫామ్ చేయడం ముఖ్య కారణం. ఇటు అహాన్ పాండే, అటు అనీత్ పడ్డా.. ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అనీత్కు కుర్రాళ్లయితే తమ గుండెల్లో గుడి కట్టేశారు.
తన అందం, అభినయంతో ఆమె అంతగా ఆకట్టుకుంది. ‘సైయారా’ విడుదలకు ముందే అనీత్తో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు ఇంకో మూడు చిత్రాలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు రావడం విశేషం. వేరే ప్రొడక్షన్ హౌస్ల నుంచి కూడా ఆమెకు అవకాశాలు వెల్లువెతాయి. ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ సైతం అనీత్తో ఒక క్రేజీ మూవీ తీయడానికి ప్లాన్ చేసింది.
మ్యాడ్ రాక్ హార్రర్ కామెడీ యూనివర్శ్లో భాగంగా ‘థామా’ చిత్రాన్ని అందించిన మ్యాడ్ డాక్ సంస్థ.. సినిమా చివర్లో ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా విశేషాలను పంచుకుంది. ‘శక్తి షాలిని’ పేరుతో తెరకెక్కుతున్న ఆ చిత్రం.. అనీత్ పడ్డా లీడ్ రోల్ చేయనుంది. ‘థామా’ హిందీ వెర్షన్లో ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ప్రేక్షకులకు క్రేజీగా ఫీలవుతున్నారు.
‘సైయారా’లో చాలా డెలికేట్గా కనిపించిన అనీత్.. హార్రర్ కామెడీలో దయ్యం పాత్ర చేయనుండడం షాకింగే. ఆమె నుంచి తర్వాత ఇలాంటి పాత్రను ఎవ్వరూ ఊహించరు. మ్యాడ్ డాక్ వాళ్ల హార్రర్ కామెడీలంటే ముందే బ్లాక్ బస్టర్ అని ఫిక్సయిపోతున్నారు నార్త్ ఆడియన్స్. ‘థామా’ సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘శక్తి షాలిని’ అనౌన్స్మెంట్లోనే రిలీజ్ డేట్ కూడా ఖరారు చేసింది చిత్ర బృందం. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on October 21, 2025 2:52 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…