‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు బుచ్చిబాబు సనా. తన దర్శకత్వ ప్రతిభ చూసి ఇండస్ట్రీ షాకైపోయింది. రెండో సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో సినిమా చేసే అద్భుత అవకాశాన్ని అందుకున్నాడు. దీన్ని కూడా అతను సద్వినియోగం చేసుకునేలాగే కనిపిస్తున్నాడు. ‘పెద్ది’కి సంబంధించి ప్రోమోలన్నీ చాలా ఎగ్జైటింగ్గా ఉండి సినిమా మీద అంచనాలను పెంచుతున్నాయి. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఐతే మార్చి 27న చరణ్ పుట్టిన రోజు కాగా.. ముందు రోజు శ్రీరామనవమి కావడంతో ఆ రోజే ‘పెద్ది’ని రిలీజ్ చేయాలని టీం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ‘పెద్ది’ షూట్ మంచి ఉత్సాహంతో సాగిపోతున్న సమయంలో టీంలో చిన్న డిస్టర్బెన్స్ మొదలైనట్లు సమాచారం. ‘పెద్ది’ సినిమాయే లోకంగా బతుకుతున్న బుచ్చిబాబు అనారోగ్యం పాలయ్యాడట. రేయింబవళ్లు సినిమా మీదే ధ్యాస పెట్టిన అతను.. సరిగా తిండి తినక, నిద్ర పోక అస్వస్థతకు గురయ్యాడట.
మనిషి మామూలుగానే వీక్గా కనిపిస్తాడు. ఇక తిండి, నిద్ర గురించి పట్టించుకోకపోవడంతో అతను మరింత బలహీనంగా తయారయ్యాడని.. ఈ విషయం రామ్ చరణ్కు తెలియడంతో కొన్ని రోజులు షూటింగ్ ఆపించాడని అంటున్నారు. ఆరోగ్యం చాలా ముఖ్యమని చెప్పి బుచ్చిబాబుకు విశ్రాంతి ఇప్పించారని.. తర్వాత షూటింగ్ పున:ప్రారంభం అయిందని టీం వర్గాలు చెబుతున్నాయి. కానీ బుచ్చిబాబు ఇంకా వీక్గానే ఉన్నాడట. అతడి డెడికేషన్ చూసి టీం అంతా ఆశ్చర్యపోతోందని.. కచ్చితంగా చరణ్కు ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే తపనతో అతను పని చేస్తున్నాడని తెలిసి మెగా అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…