‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా బడ్జెట్ పరంగా, బిజినెస్ పరంగా, వసూళ్ల పరంగా అప్పటికి ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. ఆ తర్వాత ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇంత భారీ సినిమాను నిర్మించి, బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తిరగరాశాక దాన్ని నిర్మించిన సంస్థ నుంచి పెద్ద పెద్ద సినిమాలే ఆశిస్తాం.
కానీ ఆర్క మీడియా వర్క్స్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఓటీటీలో రిలీజైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే చిన్న సినిమాతో సరిపెట్టింది. ‘బాహుబలి’ రెండు భాగాలతో భారీ లాభాలు అందుకున్నా.. ప్రొడక్షన్ మీద మంచి పట్టు ఉన్నా సరే.. ఆర్క మీడియా అధినేతలు ప్రొడక్షన్లో యాక్టివ్గా లేరు. ఐతే చాలా గ్యాప్ తర్వాత గత ఏడాది ఆరంభంలో ఈ సంస్థ రెండు చిత్రాలను అనౌన్స్ చేసింది. అవే ఆక్సిజన్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్.
ఈ రెండు చిత్రాల్లోనూ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ హీరోగా చేయాల్సింది. కానీ ఈ సినిమాలు అనౌన్స్మెంట్కే పరిమితం అయ్యాయి. షూట్ మొదలుకాలేదు. వాటి గురించి ఏ అప్డేట్ కూడా లేదు. ఐతే ఎట్టకేలకే ఇందులో ఒక సినిమా చిత్రీకరణను టీం మొదలుపెట్టింది. అదే.. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఈ చిత్రాన్ని శశాంక్ యేలేటి రూపొందించనున్నాడు. యేలేటి అనే ఇంటి పేరు ఉందంటే.. అతను చంద్రశేఖర్ యేలేటి ఫ్యామిలీ మెంబర్ అయ్యుండొచ్చు.
యేలేటి కుటుంబంతో రాజమౌళి ఫ్యామిలీకి బంధుత్వం ఉందన్న సంగతి తెెలిసిందే. శశాంక్ ఇంతకుముందు ‘మన ముగ్గురి లవ్ స్టోరీ’ అనే టీవీ సిరీస్ చేశాడు. ఫాహద్ను ఒప్పించి తెలుగులో హీరోగా నటింపజేస్తున్నారంటే ఇది స్పెషల్ ఫిలిమే అయ్యుంటుందని భావిస్తున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రెజెంట్ చేస్తుండడం, ఆయన తనయుడు కార్తికేయ దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుండడం విశేషం. ఈ చిత్రం వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనుందట.
This post was last modified on October 19, 2025 1:45 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…