అభిమానులు అనుష్కని రెగ్యులర్ గా తెరమీద చూడాలని కోరుకుంటున్నారు కానీ తను మాత్రం రెండు మూడేళ్ళకో సినిమా చేస్తూ కనీసం ప్రమోషన్ల కోసమైనా దర్శనమివ్వకుండా దోబూచులాడుతోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఘాటీ రెండింటిలోనూ ఇది అనుభవమయ్యింది. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ ఇంటర్వ్యూలలో కనిపిస్తుందని అంటున్నారు కానీ వీడియో బయటికి వస్తే తప్ప నిజమని నమ్మే పరిస్థితి లేదు. అలాని అనుష్కతో తీయడానికి నిర్మాతలు రెడీగా లేరని కాదు. భాగమతి 2తో సహా ఎందరో రైటర్లు డైరెక్టర్లు ఆమెను కలుసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దర్శనం చిక్కితేగా.
నాగార్జున వందో మూవీ ఆర్ కార్తీక దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీంట్లో టబుని ఆల్రెడీ ఒక కీలక పాత్రకు లాక్ చేశారని టాక్ ఉంది. మెయిన్ హీరోయిన్ గా ఇప్పుడు అనుష్కని అడుగుతున్నారని లేటెస్ట్ అప్డేట్. నిజానికి నాగ్ అంటే స్వీటీకి చాలా అభిమానం. సూపర్ తో ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృతజ్ఞత ఎప్పటి నుంచో ఉంది. ఆ కారణంగానే ఇష్టం అయిష్టాలను పక్కన పెట్టి సోగ్గాడే చిన్ని నాయనా, ఓం నమో వెంకటేశాయ లాంటి సినిమాల్లో క్యామియోలు చేసింది. ఇప్పుడీ నాగ్ 100 కోసం తనను సంప్రదిస్తే నో చెప్పకపోవచ్చు. అసలు అడిగారా అనేది ప్రశ్న. ఒకవేళ కన్ఫర్మ్ అయితే నాగ్ ఫ్యాన్స్ కు పండగే.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న నాగార్జున 100కి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఒకప్పుడు ప్రభుత్వాలను తన చిటికెన వేలు మీద నడిపించిన ఒక లాటరీ డాన్ జీవితం ఆధారంగా ఇది రాసుకున్నారని తెలిసింది. అతనెవరనేది బయట పెట్టలేదు కానీ స్టోరీ బ్యాక్ డ్రాప్ తొంభై దశకంలో ఉంటుందని అంటున్నారు. ఫైనల్ గా టబు, అనుష్క కనక నాగార్జున సరసన చేరితే వింటేజ్ వైబ్స్ రావడం ఖాయం. సోలో హీరోగా నా సామిరంగా తర్వాత మరో సినిమా చేయని నాగార్జున నుంచి సాలిడ్ ఎంటర్ టైనర్ వచ్చి ఏళ్ళు గడిచిపోయాయి. మరి ఈ ల్యాండ్ మార్క్ చిత్రం ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.
This post was last modified on October 17, 2025 2:39 pm
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…