మిత్ర మండలి మీద అపారమైన నమ్మకం చూపించిన నిర్మాత బన్నీ వాస్, రిలీజ్ కు ముందు రోజు అది కూడా బుధవారం రాత్రి ప్రీమియర్లు వద్దని చాలా మంది వారించారని ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. రెండు మూడు షోలు వేగంగా ఫిల్లింగ్ అవుతున్నాయనే ఉద్దేశంతో ముఖ్యంగా హైదరాబాద్ షోలు విపరీతంగా పెంచేసుకుంటూ పోయారు. ఇతర ప్రాంతాల్లో కూడా సాయంత్రం ఏడు నుంచే ఆటలు మొదలుపెట్టేశారు. అయితే ఆయనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఫ్రెండ్స్ చెప్పినట్టే మిత్ర మండలి మీద సదరు స్పెషల్ షోల టాక్ ప్రభావం గట్టిగానే చూపించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో.
మొన్న అర్ధరాత్రికి మునుపే మిత్ర మండలి గురించి ట్వీట్లు రివ్యూలు సామజిక మాధ్యమాల్లో కనిపించాయి. అధిక శాతం మిక్స్డ్ తరహాలో ఉండటంతో న్యూట్రల్ ఆడియన్స్ మిగిలిన మూడు సినిమాల రిపోర్ట్స్ వచ్చాక ఏదో చూడాలో నిర్ణయించుకుందామని ఆగిపోవడంతో ఆ మేరకు బుకింగ్స్ హఠాత్తుగా నెమ్మదించేశాయి. నలుగురు కుర్రాళ్ళు, ఒక అమ్మాయి మధ్య కథను వినోదాత్మకంగా జాతిరత్నాలు తరహాలో చెప్పాలని ప్రయత్నించిన దర్శకుడు విజయేందర్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మాములుగా మొదటి రోజే సక్సెస్ మీటంటూ కనిపించే హడావిడి మిత్ర మండలికి చేయలేదు.
సినిమా బాగున్నా బాగోకపోయినా వీక్ డేస్ లో ప్రీమియర్లు వేయడం గురించి దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. తమ ప్రోడక్ట్ మీద అతి నమ్మకంతో రిస్క్ చేస్తే అసలుకే మోసం రావొచ్చు. అందుకే కె ర్యాంప్, తెలుసు కదా, డ్యూడ్ ఈ మూడింటిలో ఏదీ ఎర్లీ ప్రీమియర్లకు వెళ్లడం లేదు. కనీసం ఉదయం ఏడు గంటల షోలైనా వేసే సాహసం చేయలేదు. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అందరితో పాటు ఒకేసారి బరిలో దిగాలి. కానీ ముందు వచ్చి అడ్వాంటేజ్ తీసుకుందామనే ప్రయత్నం బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు. మరి మిత్ర మండలి దీని వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యిందో తెలిసేది వీకెండ్ తర్వాతే.
This post was last modified on October 17, 2025 11:45 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…