మిత్ర మండలి మీద అపారమైన నమ్మకం చూపించిన నిర్మాత బన్నీ వాస్, రిలీజ్ కు ముందు రోజు అది కూడా బుధవారం రాత్రి ప్రీమియర్లు వద్దని చాలా మంది వారించారని ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. రెండు మూడు షోలు వేగంగా ఫిల్లింగ్ అవుతున్నాయనే ఉద్దేశంతో ముఖ్యంగా హైదరాబాద్ షోలు విపరీతంగా పెంచేసుకుంటూ పోయారు. ఇతర ప్రాంతాల్లో కూడా సాయంత్రం ఏడు నుంచే ఆటలు మొదలుపెట్టేశారు. అయితే ఆయనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఫ్రెండ్స్ చెప్పినట్టే మిత్ర మండలి మీద సదరు స్పెషల్ షోల టాక్ ప్రభావం గట్టిగానే చూపించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో.
మొన్న అర్ధరాత్రికి మునుపే మిత్ర మండలి గురించి ట్వీట్లు రివ్యూలు సామజిక మాధ్యమాల్లో కనిపించాయి. అధిక శాతం మిక్స్డ్ తరహాలో ఉండటంతో న్యూట్రల్ ఆడియన్స్ మిగిలిన మూడు సినిమాల రిపోర్ట్స్ వచ్చాక ఏదో చూడాలో నిర్ణయించుకుందామని ఆగిపోవడంతో ఆ మేరకు బుకింగ్స్ హఠాత్తుగా నెమ్మదించేశాయి. నలుగురు కుర్రాళ్ళు, ఒక అమ్మాయి మధ్య కథను వినోదాత్మకంగా జాతిరత్నాలు తరహాలో చెప్పాలని ప్రయత్నించిన దర్శకుడు విజయేందర్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మాములుగా మొదటి రోజే సక్సెస్ మీటంటూ కనిపించే హడావిడి మిత్ర మండలికి చేయలేదు.
సినిమా బాగున్నా బాగోకపోయినా వీక్ డేస్ లో ప్రీమియర్లు వేయడం గురించి దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. తమ ప్రోడక్ట్ మీద అతి నమ్మకంతో రిస్క్ చేస్తే అసలుకే మోసం రావొచ్చు. అందుకే కె ర్యాంప్, తెలుసు కదా, డ్యూడ్ ఈ మూడింటిలో ఏదీ ఎర్లీ ప్రీమియర్లకు వెళ్లడం లేదు. కనీసం ఉదయం ఏడు గంటల షోలైనా వేసే సాహసం చేయలేదు. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అందరితో పాటు ఒకేసారి బరిలో దిగాలి. కానీ ముందు వచ్చి అడ్వాంటేజ్ తీసుకుందామనే ప్రయత్నం బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు. మరి మిత్ర మండలి దీని వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యిందో తెలిసేది వీకెండ్ తర్వాతే.
This post was last modified on October 17, 2025 11:45 am
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…