సామజిక సమస్యలను తీసుకుని వయొలెన్స్ జోడించి చాలా సీరియస్ సినిమాలు తీస్తారని పేరున్న దర్శకుడు వెట్రిమారన్ త్వరలో అరసన్ తో రాబోతున్నారు. తెలుగులో సామ్రాజ్యం పేరుతో డబ్బింగ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ద్వారా టీజర్ లాంచ్ జరిగింది. పేరుకి ప్రోమో అన్నారు కానీ ఏకంగా 5 నిమిషాలకు పైగా వీడియోతో కంటెంట్ గురించి క్లారిటీ ఇచ్చారు. వెట్రిమారన్ బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా చెప్పుకునే వడ చెన్నై యునివర్స్ లో భాగంగా దీన్ని తీస్తున్న క్రమంలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ధనుష్ క్యామియో ఉంటుందనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో బలంగా ఉంది.
కథేంటో వీడియోలో చెప్పలేదు కానీ కాన్సెప్ట్ వివరించారు. ఒక పల్లెటూరి యువకుడు. పైకి అమాయకంగా ఉన్నా లోలోపల అగ్ని పర్వతం మోస్తూ ఉంటాడు. ఓ రాత్రి ఊళ్ళో ఓ ముగ్గురిని దారుణంగా కత్తులతో నరికి చంపేసి, సైకిల్ మీదెళ్ళి కొళాయి దగ్గర శుభ్రంగా స్నానం చేసే టైపు. ఎన్ని హత్యలు చేసినా ఇతగాడు పోలీసులకు చిక్కడు. ఓసారి దొరికిపోతాడు. కోర్టులో జడ్జ్ అడిగితే నాకేం తెలియదంటూ బుకాయిస్తాడు. మాసిన చొక్కా, పంచెకట్టుతో ఉండే ఇతని వెనుక అంత దారుణమైన నేపథ్యం ఎందుకుంది, నరమేథం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది తెరమీద చూడాలి.
ఈసారి వెట్రిమారన్ కు అనిరుద్ రవిచందర్ తోడవ్వడంతో సన్నివేశాలలో డెప్త్ పెరిగిపోయింది. విడుదల పార్ట్ 1 2, అసురన్, విసరనై తరహా ట్రీట్ మెంట్ సామ్రాజ్యంలో కనిపిస్తున్నప్పటికీ ఇప్పటిదాకా శింబుని ఎవరూ చూపించినంత డార్క్ క్యారెక్టర్ లో వెట్రిమారన్ ప్రెజెంట్ చేయబోతున్న వైనం స్పష్టమవుతోంది. మూవ్ లవర్స్ వెట్రి నుంచి కోరుకుంటున్నది ఇలాంటి బ్లాస్ట్ లే. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు కానీ వచ్చే ఏడాది వేసవిలో రావొచ్చని ఒక అంచనా. క్యాస్టింగ్ గురించి వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్న వెట్రిమారన్ బృందం ఈసారి తెరమీద రక్తపాతం చిందించడం ఖాయం.
This post was last modified on October 17, 2025 10:54 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…