బాహుబలి ది ఎపిక్ ఫైనల్ వెర్షన్ 3 గంటల 44 నిమిషాలకు లాక్ చేశారు. సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్ వచ్చేసింది. ఇంకో పావు గంట ఇంటర్వెల్ కలుపుకుంటే మొత్తం 240 నిమిషాల పాటు థియేటర్లో గడపాల్సి ఉంటుంది. ఒకవేళ మల్టీప్లెక్సులు కనక అదనంగా యాడ్స్ వేసుకుంటే ఆ మేరకు సమయం మరింత పెరుగుతుంది. కానీ దీనికి ఛాన్స్ తక్కువ. ఎందుకంటే షోలు సర్దుబాటు చేయడం చాలా కష్టమవుతుంది. ఒకపక్క అదే రోజు మాస్ జాతర రిలీజ్ ఉంది. వీటితో పాటు ముందు వారం వచ్చిన సినిమాలు కొనసాగుతూ ఉంటాయి. సో బాహుబలి ది ఎపిక్ టైంని మేనేజ్ చేసుకోవడం యాజమాన్యాలకు పెద్ద సవాలే.
ఎలా చూసుకున్నా ఒక స్క్రీన్ లో బాహుబలి ఎపిక్ నాలుగు కంటే ఎక్కువ షోలు వేయలేరు. పన్నెండు గంటల సమయం స్క్రీనింగ్ కు పోగా, మరో రెండు గంటలు క్లీనింగ్ వగైరా కార్యక్రమాలు ఉంటాయి. అర్ధరాత్రి తర్వాత పర్మిషన్లు ఉండవు కాబట్టి చివరి ఆట పదకొండు కల్లా వేసేయాలి. ప్రాక్టికల్ గా చిక్కులైతే ఉంటాయి. అభిమానులకు, మూవీ లవర్స్ కి నిడివి సమస్యే కాదు. బాహుబలి ప్రపంచాన్ని వెబ్ సిరీస్ లాగా అయిదారు గంటలు చూపించినా ఎంజాయ్ చేస్తారు. కానీ రెగ్యులర్ రేట్లకు టికెట్లు అమ్మిన థియేటర్లకు ఒక షో రెవిన్యూ తగ్గడమే కాక కరెంట్ బిల్లులు, ఏసీ ఖర్చులు మరింత ఎక్కువవుతాయి.
అలాని ఇంత లెన్త్ తో రన్ అయిన సినిమాలు లేవని కాదు. పుష్ప 2 ది రూల్ లేట్ రన్ లో కొత్త వెర్షన్ దాదాపు బాహుబలి ఎపిక్ అంత నిడివితోనే ఆడింది. కానీ అప్పటికే అధిక శాతం ప్రేక్షకులు చూసేసి ఉండటంతో మళ్ళీ పెద్దగా వసూళ్లు పెరగలేదు. కానీ ప్రభాస్ మూవీ పరిస్థితి అది కాదు. ఏది ఏమైనా ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. అందరూ రీ రిలీజులతో మొహం మొత్తేలా చేస్తుంటే తను మాత్రం ఏకంగా కొత్త సినిమాలే భయపడే రేంజ్ లో ఎపిక్ ని మార్కెటింగ్ చేస్తున్నారు. ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడం కూడా అందులో భాగంగా చేస్తున్నదే. చూడాలి ఇంకేం సర్ప్రైజులు రాబోతున్నాయో.
This post was last modified on October 17, 2025 10:37 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…