సంక్రాంతికి సినిమాలు విడుదల చేయడానికి పలువురు హీరోలు సిద్ధమయ్యారు. సాయి ధరమ్ తేజ్ అయితే అందరికంటే ముందుగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పటికీ కొన్ని పెద్ద సినిమాలకు ఓటిటి రిలీజ్ మీద ఆసక్తి వుందంటే ఆశ్చర్యం కలుగుతోంది. వాటిలో నితిన్ రంగ్ దే ఒకటట. గత చిత్రం భీష్మతో హిట్టు కొట్టిన నితిన్ ఈ చిత్రాన్ని ఎలా విడుదల చేసుకున్నా ఓకే అని చెప్పేసాడట. ఓటిటి ద్వారా రావడానికి లేదు, థియేటర్లలోనే విడుదల చేయాలని అతను కండిషన్స్ ఏమీ పెట్టడం లేదు.
అయితే థియేటర్లు తెరిచినా కానీ మునుపటిలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, అప్పటి మాదిరిగా కలక్షన్లు వస్తాయా అనేది అనుమానంగా వుంది. ఈ చిత్రానికి బడ్జెట్ కూడా బాగా అవడంతో ఒక నాలుగైదు కోట్లు లాభం వచ్చేలా ఓటిటి డీల్ ఏదైనా వస్తే ‘సోలో బ్రతుకే సో బెటర్’లా ఓకే చేసేసుకోవాలని చూస్తున్నారట. సోలో.. సినిమాను జీ నెట్వర్క్ టోటల్ నెగెటివ్ రైట్స్ తీసుకుని థియేటర్లలో విడుదల చేస్తోంది. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్స్ గోల వుండదు కాబట్టి నిర్మాతకు ఎలాంటి చీకు చింత వుండదు. అలాగే రంగ్ దేకు కూడా డీల్ సెట్ చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. బహుశా త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడవచ్చు.
This post was last modified on November 29, 2020 1:45 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…