సంక్రాంతికి సినిమాలు విడుదల చేయడానికి పలువురు హీరోలు సిద్ధమయ్యారు. సాయి ధరమ్ తేజ్ అయితే అందరికంటే ముందుగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పటికీ కొన్ని పెద్ద సినిమాలకు ఓటిటి రిలీజ్ మీద ఆసక్తి వుందంటే ఆశ్చర్యం కలుగుతోంది. వాటిలో నితిన్ రంగ్ దే ఒకటట. గత చిత్రం భీష్మతో హిట్టు కొట్టిన నితిన్ ఈ చిత్రాన్ని ఎలా విడుదల చేసుకున్నా ఓకే అని చెప్పేసాడట. ఓటిటి ద్వారా రావడానికి లేదు, థియేటర్లలోనే విడుదల చేయాలని అతను కండిషన్స్ ఏమీ పెట్టడం లేదు.
అయితే థియేటర్లు తెరిచినా కానీ మునుపటిలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, అప్పటి మాదిరిగా కలక్షన్లు వస్తాయా అనేది అనుమానంగా వుంది. ఈ చిత్రానికి బడ్జెట్ కూడా బాగా అవడంతో ఒక నాలుగైదు కోట్లు లాభం వచ్చేలా ఓటిటి డీల్ ఏదైనా వస్తే ‘సోలో బ్రతుకే సో బెటర్’లా ఓకే చేసేసుకోవాలని చూస్తున్నారట. సోలో.. సినిమాను జీ నెట్వర్క్ టోటల్ నెగెటివ్ రైట్స్ తీసుకుని థియేటర్లలో విడుదల చేస్తోంది. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్స్ గోల వుండదు కాబట్టి నిర్మాతకు ఎలాంటి చీకు చింత వుండదు. అలాగే రంగ్ దేకు కూడా డీల్ సెట్ చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. బహుశా త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడవచ్చు.
This post was last modified on November 29, 2020 1:45 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…