బెల్లంకొండ శ్రీనివాస్కి ఒక స్టడీ మార్కెట్ వచ్చే వరకు అతనితో నటించే హీరోయిన్ల విషయంలో అసలు రాజీ పడలేదు. అప్పటికి హాట్ అనిపించుకున్న హీరోయిన్లకు మార్కెట్ రేటుకి మించి పారితోషికం ఇచ్చి మరీ అతని సినిమాల్లో పెట్టుకున్నారు. అల్లుడు శీనుతో పరిచయం అయిన శ్రీనివాస్ మొదటి సినిమాలోనే సమంతతో రొమాన్స్ చేసాడు. అందుకోసం అప్పట్లో సమంతకు భారీ పారితోషికం ఇచ్చారని కథలు కథలుగా చెప్పుకున్నారు.
పూజ హెగ్డే, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా లాంటి హీరోయిన్లతో నటించిన శ్రీనివాస్ తన బాలీవుడ్ డెబ్యూలో కూడా స్టార్ హీరోయిన్ కావాలనుకుంటున్నాడు. వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ వుంటే బాగుంటుందని భావిస్తున్నాడు. ఇప్పుడు కియారాకు బాలీవుడ్లో చాలా డిమాండ్ వుంది.
బాలీవుడ్ ఏ లిస్ట్ హీరోలతో నటిస్తోన్న కియారా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే రేంజ్కి క్రేజ్ తెచ్చుకుంది. ఆమెను ఒప్పించాలంటే కచ్చితంగా భారీగా పారితోషికం ఇచ్చి తీరాలి. ఒకవేళ అన్ని డబ్బులిచ్చినా కానీ కియారా ఈ టైమ్లో ఒక సౌత్ హీరో డెబ్యూ సినిమాలో నటిస్తుందా లేదా అనేది అనుమానమే.
This post was last modified on November 29, 2020 1:34 am
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…