బెల్లంకొండ శ్రీనివాస్కి ఒక స్టడీ మార్కెట్ వచ్చే వరకు అతనితో నటించే హీరోయిన్ల విషయంలో అసలు రాజీ పడలేదు. అప్పటికి హాట్ అనిపించుకున్న హీరోయిన్లకు మార్కెట్ రేటుకి మించి పారితోషికం ఇచ్చి మరీ అతని సినిమాల్లో పెట్టుకున్నారు. అల్లుడు శీనుతో పరిచయం అయిన శ్రీనివాస్ మొదటి సినిమాలోనే సమంతతో రొమాన్స్ చేసాడు. అందుకోసం అప్పట్లో సమంతకు భారీ పారితోషికం ఇచ్చారని కథలు కథలుగా చెప్పుకున్నారు.
పూజ హెగ్డే, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా లాంటి హీరోయిన్లతో నటించిన శ్రీనివాస్ తన బాలీవుడ్ డెబ్యూలో కూడా స్టార్ హీరోయిన్ కావాలనుకుంటున్నాడు. వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ వుంటే బాగుంటుందని భావిస్తున్నాడు. ఇప్పుడు కియారాకు బాలీవుడ్లో చాలా డిమాండ్ వుంది.
బాలీవుడ్ ఏ లిస్ట్ హీరోలతో నటిస్తోన్న కియారా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే రేంజ్కి క్రేజ్ తెచ్చుకుంది. ఆమెను ఒప్పించాలంటే కచ్చితంగా భారీగా పారితోషికం ఇచ్చి తీరాలి. ఒకవేళ అన్ని డబ్బులిచ్చినా కానీ కియారా ఈ టైమ్లో ఒక సౌత్ హీరో డెబ్యూ సినిమాలో నటిస్తుందా లేదా అనేది అనుమానమే.
This post was last modified on November 29, 2020 1:34 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…