డబ్బులిసుర్తున్న బెల్లంకొండ… ఆమె పడుతుందా?

బెల్లంకొండ శ్రీనివాస్‍కి ఒక స్టడీ మార్కెట్‍ వచ్చే వరకు అతనితో నటించే హీరోయిన్ల విషయంలో అసలు రాజీ పడలేదు. అప్పటికి హాట్‍ అనిపించుకున్న హీరోయిన్లకు మార్కెట్‍ రేటుకి మించి పారితోషికం ఇచ్చి మరీ అతని సినిమాల్లో పెట్టుకున్నారు. అల్లుడు శీనుతో పరిచయం అయిన శ్రీనివాస్‍ మొదటి సినిమాలోనే సమంతతో రొమాన్స్ చేసాడు. అందుకోసం అప్పట్లో సమంతకు భారీ పారితోషికం ఇచ్చారని కథలు కథలుగా చెప్పుకున్నారు.

పూజ హెగ్డే, కాజల్‍ అగర్వాల్‍, రకుల్‍ ప్రీత్‍ సింగ్‍, తమన్నా లాంటి హీరోయిన్లతో నటించిన శ్రీనివాస్‍ తన బాలీవుడ్‍ డెబ్యూలో కూడా స్టార్‍ హీరోయిన్‍ కావాలనుకుంటున్నాడు. వినాయక్‍ దర్శకత్వంలో ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్‍ చేస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్‍ ఇందులో హీరోయిన్‍గా కియారా అద్వానీ వుంటే బాగుంటుందని భావిస్తున్నాడు. ఇప్పుడు కియారాకు బాలీవుడ్‍లో చాలా డిమాండ్‍ వుంది.

బాలీవుడ్‍ ఏ లిస్ట్ హీరోలతో నటిస్తోన్న కియారా లేడీ ఓరియెంటెడ్‍ సినిమాలు చేసే రేంజ్‍కి క్రేజ్‍ తెచ్చుకుంది. ఆమెను ఒప్పించాలంటే కచ్చితంగా భారీగా పారితోషికం ఇచ్చి తీరాలి. ఒకవేళ అన్ని డబ్బులిచ్చినా కానీ కియారా ఈ టైమ్‍లో ఒక సౌత్‍ హీరో డెబ్యూ సినిమాలో నటిస్తుందా లేదా అనేది అనుమానమే.