Movie News

టీవీ పెళ్లిపై ట్రోల్స్… హీరోయిన్ ఏమందంటే?

చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్‌గా దేశవ్యాప్తంగా అవికా గోర్ ఎంత పేరు సంపాదించిందో తెలిసిందే. ఆ గుర్తింపుతోనే ఆమె హీరోయిన్ కూడా అయింది. తెలుగులో దాదాపు 20 సినిమాల దాకా నటించింది. హిందీలో కూడా ఆమె కొన్ని చిత్రాల్లో నటించింది. మధ్యలో తెలుగు సినిమాలకు కొంత కాలం దూరమైన ఆమె.. బాగా బరువు తగ్గి నాజూగ్గా తయారై వచ్చింది. ఆ తర్వాత ఆమె మళ్లీ అవకాశాలు పెరిగాయి.

పెద్ద సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా.. చిన్న చిత్రాలకు మాత్రం లోటు లేదు. ఇలా కెరీర్ బాగానే సాగుతున్న టైంలో అవికా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్నేళ్లుగా రిలేేషన్‌షిప్‌లో ఉన్న మిలింద్‌నే ఆమె పెళ్లి చేసుకుంది. కానీ ఆ వివాహం మామూలుగా జరగలేదు. ఒక రియాలిటీ షోకు వెళ్లి అక్కడ పెళ్లి చేసుకుంది అవికా. దీని మీద విమర్శలు తప్పలేదు.

అవికా పెళ్లిని కూడా కమర్షియల్ చేసేసిందని.. డబ్బు కోసమే ఈ మార్గాన్ని ఎంచుకుందని సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పలేదు. దీనిపై అవికా తాజాగా స్పందించింది. తాను డబ్బు కోసం ఇలా చేయలేదని.. తనకు లైఫ్ ఇచ్చింది టీవీనే అని.. అందుకే టీవీ రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవాలన్నది తన చిన్ననాటి కోరిక అని ఆమె చెప్పింది.

‘‘టీవీ షోలో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని మిలింద్‌కు చెప్పినపుడు అతను ఓకే అన్నాడు. కానీ జనం నుంచి విమర్శలు వస్తాయి కదా అన్నాడు. డబ్బు కోసమే అలా చేస్తున్నామని అంటారేమో అని సందేహించాడు కూడా. కానీ నేను పర్వాలేదన్నాను. ఈ నిర్ణయంపై మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. అనుకున్నట్లే ట్రోల్స్ వచ్చాయి. కొందరు నా వెడ్డింగ్ లుక్ మీదా విమర్శలు గుప్పించారు. కానీ ఆ ట్రోల్స్ మిలింద్ మీద వస్తే ఫీలయ్యేదాన్ని. ఎందుకంటే తన లుక్ డిజైన్ చేసింది నేనే. మిగతా విషయాల్లో ఏమీ బాధ లేదు’’ అని అవికా చెప్పింది. ఓ హిందీ రియాలిటీ షోలో సెప్టెంబరు 30న వీరి పెళ్లి ఆడంబరంగా సాగింది.

This post was last modified on October 15, 2025 5:12 pm

Share

Recent Posts

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

7 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

54 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago