సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు ఉస్తాద్ భగత్ సింగ్ తో పూర్తయిపోయాయి. నిర్మాత రామ్ తాళ్ళూరిది ఒక్కటే బ్యాలన్స్ ఉంది. అయితే ఆయన ఇప్పటికిప్పుడు చేయమని ఒత్తిడి పెట్టడం లేదు. కాకపోతే దర్శకుడు సురేందర్ రెడ్డి ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంచాడు కాబట్టి వేగంగా షూటింగ్ చేసే సాధ్యాసాధ్యాలు ఉంటే చెప్పమని పవన్ ఆల్రెడీ ఈ టీమ్ తో మాట్లాడినట్టు ఇన్ సైడ్ టాక్. అయితే ముందు అనుకున్న కథ ప్రకారం హైదరాబాద్, అమరావతిలోనే తీసే వీలు ఇందులో లేదట. అందుకే మార్పుల కోసం సూరి కొంత టైం అడిగినట్టు వినికిడి. ఇది పక్కనపెడితే పవన్ డేట్ల కోసం ప్రయత్నిస్తున్న నిర్మాతలు ఇంకా ఉన్నారు.
వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేసేందుకు నిర్మాత దిల్ రాజు మహా ఉత్సాహంగా ఉన్నారు. ఓజి నైజామ్ హక్కులు భారీ లాభాలు ఇవ్వడంతో మరింత కిక్ వచ్చేసింది. అయితే పవన్ అంత సులభంగా అంగీకారం తెలిపే పరిస్థితి లేదు. ఇంకో మూడేళ్ళలో ఎన్నికలు వస్తాయి. కూటమిని మళ్ళీ అధికారికంలో తేవాలని కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రిగా చివరి రెండు సంవత్సరాలు చాలా కీలకం. జనసేనని బలోపేతం చేసుకోవడం, ఎలక్షన్ల కోసం కార్యాచరణ, చంద్రబాబు ప్రభుత్వంతో మంతనాలు ఇలా సవాలక్ష వ్యవహారాలకు తోడు వివిధ శాఖలు, పిఠాపురం అభివృద్ధి ఇవన్నీ చూసుకోవాలి.
ఇంత టైట్ షెడ్యూల్ లో అసలు పవన్ కు సినిమాల గురించి ఆలోచించే ఓపిక తీరిక ఉండవు. అందుకే ఓజితోనే అభిమానులు తమ ఆకలిని పూర్తిగా తీర్చుకున్నారు. ఇకపై ఏది వచ్చినా బోనస్ గానే ఫీలవుతారు. ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్న దాని కంటే చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. అది కూడా హిట్టయితే పవన్ మీద మరింత ఒత్తిడి తోడవుతుంది. నటన కొనసాగించమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారు. సురేందర్ రెడ్డి కాకుండా ఓజి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తప్ప ఇంకేవి ఆయన మనసులో లేవని సన్నిహిత వర్గాల కథనం. ఇంకొంత కాలం ఆగితే తప్ప దీనికి సంబంధించిన క్లారిటీ రాదు. అప్పటిదాకా వెయిట్ చేయడమే.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…