ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో పలకరించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందులో ‘హరిహర వీరమల్లు’ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసినా.. ‘ఓజీ’ తమ ఆకలి తీర్చడం, బాక్సాఫీస్ దగ్గర కూడా బాగా ఆడడంతో వాళ్లు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక పవన్ చేతిలో ఉన్నది ఒక్కటే సినిమా. అదే.. ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు సంబంధించి పవన్ తన షూటింగ్ పార్ట్ అంతా గత నెలలోనే పూర్తి చేసేశాడు.
దీంతో ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగానే ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తారేమో అనుకున్నారు అభిమానులు. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో పవన్ గత చిత్రాలకు భిన్నంగా జరుగుతోంది. హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలకు మిగతా నటీనటుల షూటింగ్ పార్ట్ అంతా పూర్తి చేసి పవన్ కోసం ఎదురు చూశారు. పవన్ పని పూర్తవ్వగానే సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి.
కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అలా కాదు. ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలను పూర్తి చేసి పవన్ అందుబాటులోకి రాగానే.. ఆయనతో ముడిపడ్డ సన్నివేశాలు వరుసబెట్టి తీయడం మొదలుపెట్టారు. నెల రోజుల కాల్ షీట్స్తో పాటలు సహా అన్నీ అవగొట్టేశాడు హరీష్ శంకర్. ఆయన పాత్ర వరకు టీం గుమ్మడికాయ కొట్టేసింది. కానీ ఆయనతో సంబంధం లేకుండా ఇంకా తీయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయట.
ఈ సినిమాకు సంబంధించి ఇంకా 25 రోజుల షూటింగ్ మిగిలి ఉందని నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. అవి పూర్తయ్యాకే విడుదల గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. ఇంకా ‘ఉస్తాద్’ రిలీజ్ డేట్ గురించి తాము ఏమీ అనుకోలేదని రవిశంకర్ తెలిపారు. ఈ ఏడాదిలో అయితే సినిమా విడుదలకు సిద్ధమయ్యే పరిస్థితి లేదు. సంక్రాంతికి అస్సలు ఖాళీ లేదు. కాబట్టి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందన్నమాట.
This post was last modified on October 10, 2025 2:00 pm
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…