కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ బ్లాక్ బస్టర్ వేళ కొందరు కన్నడ మూవీ ఫ్యాన్స్ రష్మిక మందన్నను టార్గెట్ చేసుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే ఈ సినిమా సక్సెస్ ని విష్ చేస్తూ సోషల్ మీడియాలో ఎలాంటి సందేశం ఇవ్వకపోవడం గురించట. అదేంటి చెప్పాలనే రూల్ లేదు కదాని అనిపించవచ్చు. దీని వెనుకో మతలబు ఉంది. రష్మిక డెబ్యూ చిత్రం కిరిక్ పార్టీ దర్శకుడు రిషబ్ శెట్టినే. అది గొప్ప విజయం సాధించడం వల్లే ఆమెకు ఇమేజ్, అవకాశాలు వచ్చాయి. వెంకీ కుడుముల ఈ సినిమా చూసి ఉండకపోతే ఛలో ఆఫర్ చేసేవారు కాదేమో. అలా కెరీర్ మలుపు తిరగడానికి బలమైన పునాది వేసింది కిరిక్ పార్టీనే.
అందుకే రష్మిక ఈ సెలబ్రేషన్ ని పంచుకోవాలనేది సదరు శాండల్ వుడ్ అభిమానుల డిమాండ్. అయితే ఈ విషయంలో తను మౌనంగా ఉండటమే కరెక్ట్. ఎందుకంటే కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో అప్పట్లో ఎంగేజ్ మెంట్ చేసుకున్న రష్మిక దాన్ని పరస్పర అంగీకారంతోనే రద్దు చేసుకుంది. ఆ సమయంలో తన మీద కొంత ట్రోలింగ్ నడిచింది. ఇదంతా ఎప్పుడో అయిపోయిన గతం. గతంలోనే రక్షిత్ శెట్టి అనవసరంగా ఈ ఇష్యూని పెద్దది చేస్తున్నారని, రష్మికని ఇలా లక్ష్యంగా చేసుకోవడం పద్ధతి కాదని సోషల్ మీడియాలో హితవు పలికాడు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ పేరిట కొందరు కథను మళ్ళీ మొదటికే తేవడం విచారకరం. ఇప్పుడు కాంతారకు ముడిపెట్టి రిషబ్ కి విష్ చేయలేదని విమర్శలు చేయడం అర్ధరహితం.
ఒకవేళ రష్మిక నిజంగా కాంతార గురించి స్పందించినా ఈ టార్గెటింగ్ ఆగదు. ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉంటారు. అందుకే సైలెన్స్ ఈజ్ బెస్ట్. విజయ్ దేవరకొండతో జరిగిన నిశ్చితార్థాన్ని ఇప్పటిదాకా రష్మిక అఫీషియల్ గా చెప్పలేదు. పెళ్లి డేట్, వేదిక, రిసెప్షన్ అన్నీ ఓకే అనుకున్నాక అప్పుడు అధికారికంగా జంటగా దాన్ని అనౌన్స్ చేయబోతున్నారని తెలిసింది. రష్మిక మందన్న కొత్త బాలీవుడ్ మూవీ తమ్మ ఈ నెల 21 విడుదల కానుంది. మొదటిసారి హారర్ జానర్ లో డ్రాకులాగా నటించిన తమ్మలో ఆయుష్మాన్ ఖురానా హీరో. స్త్రీ 2, ముంజ్యా, భూల్ భులాయ్యా, సైతాన్ తరహాలో దీని మీద మంచి అంచనాలే నెలకొన్నాయి.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…