కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ బ్లాక్ బస్టర్ వేళ కొందరు కన్నడ మూవీ ఫ్యాన్స్ రష్మిక మందన్నను టార్గెట్ చేసుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే ఈ సినిమా సక్సెస్ ని విష్ చేస్తూ సోషల్ మీడియాలో ఎలాంటి సందేశం ఇవ్వకపోవడం గురించట. అదేంటి చెప్పాలనే రూల్ లేదు కదాని అనిపించవచ్చు. దీని వెనుకో మతలబు ఉంది. రష్మిక డెబ్యూ చిత్రం కిరిక్ పార్టీ దర్శకుడు రిషబ్ శెట్టినే. అది గొప్ప విజయం సాధించడం వల్లే ఆమెకు ఇమేజ్, అవకాశాలు వచ్చాయి. వెంకీ కుడుముల ఈ సినిమా చూసి ఉండకపోతే ఛలో ఆఫర్ చేసేవారు కాదేమో. అలా కెరీర్ మలుపు తిరగడానికి బలమైన పునాది వేసింది కిరిక్ పార్టీనే.
అందుకే రష్మిక ఈ సెలబ్రేషన్ ని పంచుకోవాలనేది సదరు శాండల్ వుడ్ అభిమానుల డిమాండ్. అయితే ఈ విషయంలో తను మౌనంగా ఉండటమే కరెక్ట్. ఎందుకంటే కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో అప్పట్లో ఎంగేజ్ మెంట్ చేసుకున్న రష్మిక దాన్ని పరస్పర అంగీకారంతోనే రద్దు చేసుకుంది. ఆ సమయంలో తన మీద కొంత ట్రోలింగ్ నడిచింది. ఇదంతా ఎప్పుడో అయిపోయిన గతం. గతంలోనే రక్షిత్ శెట్టి అనవసరంగా ఈ ఇష్యూని పెద్దది చేస్తున్నారని, రష్మికని ఇలా లక్ష్యంగా చేసుకోవడం పద్ధతి కాదని సోషల్ మీడియాలో హితవు పలికాడు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ పేరిట కొందరు కథను మళ్ళీ మొదటికే తేవడం విచారకరం. ఇప్పుడు కాంతారకు ముడిపెట్టి రిషబ్ కి విష్ చేయలేదని విమర్శలు చేయడం అర్ధరహితం.
ఒకవేళ రష్మిక నిజంగా కాంతార గురించి స్పందించినా ఈ టార్గెటింగ్ ఆగదు. ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉంటారు. అందుకే సైలెన్స్ ఈజ్ బెస్ట్. విజయ్ దేవరకొండతో జరిగిన నిశ్చితార్థాన్ని ఇప్పటిదాకా రష్మిక అఫీషియల్ గా చెప్పలేదు. పెళ్లి డేట్, వేదిక, రిసెప్షన్ అన్నీ ఓకే అనుకున్నాక అప్పుడు అధికారికంగా జంటగా దాన్ని అనౌన్స్ చేయబోతున్నారని తెలిసింది. రష్మిక మందన్న కొత్త బాలీవుడ్ మూవీ తమ్మ ఈ నెల 21 విడుదల కానుంది. మొదటిసారి హారర్ జానర్ లో డ్రాకులాగా నటించిన తమ్మలో ఆయుష్మాన్ ఖురానా హీరో. స్త్రీ 2, ముంజ్యా, భూల్ భులాయ్యా, సైతాన్ తరహాలో దీని మీద మంచి అంచనాలే నెలకొన్నాయి.
This post was last modified on October 7, 2025 11:53 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…