కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ బ్లాక్ బస్టర్ వేళ కొందరు కన్నడ మూవీ ఫ్యాన్స్ రష్మిక మందన్నను టార్గెట్ చేసుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే ఈ సినిమా సక్సెస్ ని విష్ చేస్తూ సోషల్ మీడియాలో ఎలాంటి సందేశం ఇవ్వకపోవడం గురించట. అదేంటి చెప్పాలనే రూల్ లేదు కదాని అనిపించవచ్చు. దీని వెనుకో మతలబు ఉంది. రష్మిక డెబ్యూ చిత్రం కిరిక్ పార్టీ దర్శకుడు రిషబ్ శెట్టినే. అది గొప్ప విజయం సాధించడం వల్లే ఆమెకు ఇమేజ్, అవకాశాలు వచ్చాయి. వెంకీ కుడుముల ఈ సినిమా చూసి ఉండకపోతే ఛలో ఆఫర్ చేసేవారు కాదేమో. అలా కెరీర్ మలుపు తిరగడానికి బలమైన పునాది వేసింది కిరిక్ పార్టీనే.
అందుకే రష్మిక ఈ సెలబ్రేషన్ ని పంచుకోవాలనేది సదరు శాండల్ వుడ్ అభిమానుల డిమాండ్. అయితే ఈ విషయంలో తను మౌనంగా ఉండటమే కరెక్ట్. ఎందుకంటే కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో అప్పట్లో ఎంగేజ్ మెంట్ చేసుకున్న రష్మిక దాన్ని పరస్పర అంగీకారంతోనే రద్దు చేసుకుంది. ఆ సమయంలో తన మీద కొంత ట్రోలింగ్ నడిచింది. ఇదంతా ఎప్పుడో అయిపోయిన గతం. గతంలోనే రక్షిత్ శెట్టి అనవసరంగా ఈ ఇష్యూని పెద్దది చేస్తున్నారని, రష్మికని ఇలా లక్ష్యంగా చేసుకోవడం పద్ధతి కాదని సోషల్ మీడియాలో హితవు పలికాడు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ పేరిట కొందరు కథను మళ్ళీ మొదటికే తేవడం విచారకరం. ఇప్పుడు కాంతారకు ముడిపెట్టి రిషబ్ కి విష్ చేయలేదని విమర్శలు చేయడం అర్ధరహితం.
ఒకవేళ రష్మిక నిజంగా కాంతార గురించి స్పందించినా ఈ టార్గెటింగ్ ఆగదు. ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉంటారు. అందుకే సైలెన్స్ ఈజ్ బెస్ట్. విజయ్ దేవరకొండతో జరిగిన నిశ్చితార్థాన్ని ఇప్పటిదాకా రష్మిక అఫీషియల్ గా చెప్పలేదు. పెళ్లి డేట్, వేదిక, రిసెప్షన్ అన్నీ ఓకే అనుకున్నాక అప్పుడు అధికారికంగా జంటగా దాన్ని అనౌన్స్ చేయబోతున్నారని తెలిసింది. రష్మిక మందన్న కొత్త బాలీవుడ్ మూవీ తమ్మ ఈ నెల 21 విడుదల కానుంది. మొదటిసారి హారర్ జానర్ లో డ్రాకులాగా నటించిన తమ్మలో ఆయుష్మాన్ ఖురానా హీరో. స్త్రీ 2, ముంజ్యా, భూల్ భులాయ్యా, సైతాన్ తరహాలో దీని మీద మంచి అంచనాలే నెలకొన్నాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…