ప్రభాస్ పెళ్లి గురించి చర్చ ఈనాటిది కాదు. పదేళ్ల ముందు నుంచే నడుస్తోందది. ‘డార్లింగ్’ టైంలోనే అతను ఆ చిత్ర కథానాయిక కాజల్తో ప్రేమలో పడిపోయాడని, పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ‘మిర్చి’ సమయానికి అనుష్కతో ముడిపెట్టారు. ఆపై సినీ రంగంతో సంబంధం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని గట్టి ప్రచారమే జరిగింది.
ప్రభాస్ పెదనాన్న పలు సందర్భాల్లో ప్రభాస్ పెళ్లి గురించి మీడియాతో మాట్లాడాడు. ‘బాహుబలి’ తొలి భాగం అయ్యాక పెళ్లన్నాడు. రెండోది కూడా పూర్తి చేశాక కచ్చితంగా పెళ్లి చేసేస్తామన్నాడు. ఈ రెండు సినిమాలూ పూర్తయ్యాయి. ఐదేళ్లు గడిచాయి. ఆ తర్వాత ‘సాహో’ కోసం రెండేళ్లు ఖర్చు చేశాడు. ఆ తర్వాత కూడా ప్రభాస్ పెళ్లి విషయంలో ఏ కదలికా లేదు. అసలిప్పుడు చూస్తే ప్రభాస్కు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
రెండేళ్ల కిందటి వరకు ప్రభాస్ పెళ్లి గురించి తరచుగా ఏదో ఒక డిస్కషన్ ఉండేది. కృష్ణంరాజును, అలాగే ప్రభాస్ను కూడా మీడియా వాళ్లు ఈ విషయంపై అడిగేవాళ్లు. ప్రభాస్ అభిమానులు దీని గురించి సోషల్ మీడియాలో చర్చలు పెట్టేవాళ్లు. ఒక దశలో ఈ చర్చ బాగా ముదిరి ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’ అనే సినిమా కూడా తెరకెక్కిందంటే ప్రభాస్ పెళ్లికున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదంతా గతం. ఈ మధ్య అయితే ప్రభాస్ పెళ్లి గురించి అందరికీ ఆసక్తి చచ్చిపోయినట్లుంది. అది ఎప్పటికీ తెగే వ్యవహారం కాదన్నట్లుగా అందరూ సైలెంట్ అయిపోయారు. కృష్ణంరాజు కానీ, ప్రభాస్ కానీ ఆ విషయంపై ఎక్కడా ఏమీ మాట్లాడట్లేదు. మీడియా వాళ్లు కూడా వాళ్లను ప్రశ్నించట్లేదు. సోషల్ మీడియాలో చర్చల్లేవు. ఇంతకుముందంటే ప్రభాస్ ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రం చేస్తూ పెళ్లేంటన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ప్రతి చిత్రం ‘బాహుబలి’ రేంజ్లోనే ఉంటోంది. కాబట్టి ఈ కారణం చూపిస్తే ఇక ఎప్పటికీ ప్రభాస్ పెళ్లే చేసుకోడేమో.
This post was last modified on November 27, 2020 5:03 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…