బాక్సాఫీస్ వద్ద సునామిలా విరుచుకుపడుతున్న కాంతారా చాప్టర్ 1 ఏ లెజెండ్ రాష్ట్రంతో సంబంధం లేకుండా అన్ని చోట్ల దూసుకెళ్తోంది. వీకెండ్ కే మూడు వందల కోట్ల గ్రాస్ దాటేయడం జరిగిపోయింది కానీ అఫీషియల్ గా నిర్మాణ సంస్థ నుంచి పోస్టర్ ఏ క్షణమైనా బయటికి రావొచ్చు. అయితే కాంతార ప్రభంజనాన్ని ఏపీ తెలంగాణలో ఇడ్లీ కొట్టు ఫేస్ చేయలేకపోయింది. చాలా సెంటర్లలో దీని షోలు తీసి దానికి ఇవ్వాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డబ్బింగ్ సినిమాలకు ఆదరణ తక్కువగా ఉండే తమిళనాడులోనూ కాంతార వసూళ్లు బాగుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. .
తెలుగులో ఇడ్లి కొట్టు ఎంత ఫెయిలైనా ఒరిజినల్ వెర్షన్ మాత్రం తట్టుకుని నిలబడింది. కోలీవుడ్ ఫ్యాన్స్ కి ఇడ్లీ సాంబార్ నచ్చేసింది. బుక్ మై షోలో వీకెండ్ వరకు ఏడు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోగా సుమారు 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలయ్యిందని సమాచారం. ధనుష్ మార్కెట్ కి ఇది మంచి నెంబరే. కేవలం తమిళం నుంచే ఇంత నెంబర్ సాధించడం చూస్తే తన కంటెంట్ కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి. సాధారణంగా ఓవర్ సెంటిమెంట్ ఉన్నా నేటివిటీ, ఎమోషన్స్ కనక సరిగా చూపిస్తే తమిళ ఆడియన్స్ ఆదరిస్తారు. ముఖ్యంగా మాస్, కుటుంబ ప్రేక్షకుల మద్దతు బాగా దక్కుతుంది. ఇడ్లి కడై అందుకే హిట్టు క్యాటగిరీలో పడుతోంది.
ఫలితం పట్ల ధనుష్ సంతోషంగానే ఉన్నాడు. గత ఏడాది తనే డైరెక్ట్ చేసిన రాయన్ రేంజ్ నెంబర్లు రాకపోవచ్చేమో కానీ ఇంత హెవీ ఎమోషనల్ సబ్జెక్టు మీద ముప్పై కోట్లు రాబట్టడం చిన్న విషయం కాదు. అందులోనూ పక్క భాషలో డిజాస్టర్ అయిన సినిమాకు స్వంత చోట ఆదరణ దక్కడం సంతోషించాల్సిన విషయమే. కాంతార హవాని తట్టుకుని మరీ ఇంత స్ట్రాంగ్ గా వసూళ్లు రాబట్టడం పట్ల ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. సోమవారం నుంచి నమోదయ్యే డ్రాప్స్ ని బట్టి ఫైనల్ స్టేటస్ మీద ఒక అంచనాకు రావొచ్చు. అన్నట్టు ఇడ్లి కడై 2 కావాలని ఫ్యాన్స్ అడిగితే ధనుష్ సానుకూలంగా ఆలోచిస్తున్నట్టు చెన్నై టాక్.
This post was last modified on October 5, 2025 10:10 pm
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…
ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…