బాక్సాఫీస్ వద్ద సునామిలా విరుచుకుపడుతున్న కాంతారా చాప్టర్ 1 ఏ లెజెండ్ రాష్ట్రంతో సంబంధం లేకుండా అన్ని చోట్ల దూసుకెళ్తోంది. వీకెండ్ కే మూడు వందల కోట్ల గ్రాస్ దాటేయడం జరిగిపోయింది కానీ అఫీషియల్ గా నిర్మాణ సంస్థ నుంచి పోస్టర్ ఏ క్షణమైనా బయటికి రావొచ్చు. అయితే కాంతార ప్రభంజనాన్ని ఏపీ తెలంగాణలో ఇడ్లీ కొట్టు ఫేస్ చేయలేకపోయింది. చాలా సెంటర్లలో దీని షోలు తీసి దానికి ఇవ్వాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డబ్బింగ్ సినిమాలకు ఆదరణ తక్కువగా ఉండే తమిళనాడులోనూ కాంతార వసూళ్లు బాగుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. .
తెలుగులో ఇడ్లి కొట్టు ఎంత ఫెయిలైనా ఒరిజినల్ వెర్షన్ మాత్రం తట్టుకుని నిలబడింది. కోలీవుడ్ ఫ్యాన్స్ కి ఇడ్లీ సాంబార్ నచ్చేసింది. బుక్ మై షోలో వీకెండ్ వరకు ఏడు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోగా సుమారు 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలయ్యిందని సమాచారం. ధనుష్ మార్కెట్ కి ఇది మంచి నెంబరే. కేవలం తమిళం నుంచే ఇంత నెంబర్ సాధించడం చూస్తే తన కంటెంట్ కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి. సాధారణంగా ఓవర్ సెంటిమెంట్ ఉన్నా నేటివిటీ, ఎమోషన్స్ కనక సరిగా చూపిస్తే తమిళ ఆడియన్స్ ఆదరిస్తారు. ముఖ్యంగా మాస్, కుటుంబ ప్రేక్షకుల మద్దతు బాగా దక్కుతుంది. ఇడ్లి కడై అందుకే హిట్టు క్యాటగిరీలో పడుతోంది.
ఫలితం పట్ల ధనుష్ సంతోషంగానే ఉన్నాడు. గత ఏడాది తనే డైరెక్ట్ చేసిన రాయన్ రేంజ్ నెంబర్లు రాకపోవచ్చేమో కానీ ఇంత హెవీ ఎమోషనల్ సబ్జెక్టు మీద ముప్పై కోట్లు రాబట్టడం చిన్న విషయం కాదు. అందులోనూ పక్క భాషలో డిజాస్టర్ అయిన సినిమాకు స్వంత చోట ఆదరణ దక్కడం సంతోషించాల్సిన విషయమే. కాంతార హవాని తట్టుకుని మరీ ఇంత స్ట్రాంగ్ గా వసూళ్లు రాబట్టడం పట్ల ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. సోమవారం నుంచి నమోదయ్యే డ్రాప్స్ ని బట్టి ఫైనల్ స్టేటస్ మీద ఒక అంచనాకు రావొచ్చు. అన్నట్టు ఇడ్లి కడై 2 కావాలని ఫ్యాన్స్ అడిగితే ధనుష్ సానుకూలంగా ఆలోచిస్తున్నట్టు చెన్నై టాక్.
This post was last modified on October 5, 2025 10:10 pm
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…