రష్మిక మందన్నా పేరు నిన్నట్నుంచి సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అందుక్కారణం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఎంగేేజ్మెంట్ చేసుకోవడమే. కొన్నేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకుంది. ఇరు కుటుంబాల సభ్యుల మధ్య సింపుల్గా ఈ వేడుక జరిగిపోయింది. వచ్చే ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్సాహంలో చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న తన కొత్త చిత్రం రిలీజ్ డేట్ను ప్రకటించింది రష్మిక.
యాక్టర్ టర్న్డ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనేే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలోనే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా పడింది. చివరికి సెప్టెంబరు 5న రిలీజ్ అన్నారు. కానీ ఆ డేట్ను కూడా అందుకోలేదు.
చాలా రోజులుగా అసలు చర్చల్లో లేకుండా పోయిన ఈ సినిమాను ఒక ప్రోమోతో వార్తల్లోకి తీసుకొచ్చింది చిత్ర బృందం. ఇంట్రెస్టింగ్గా సాగిన ఆ ప్రోమో ద్వారా నవంబరు 7న ఈ చిత్రం విడుదల కానుందని వెల్లడించారు. ఒక అబ్బాయికి అమ్మాయి.. లేదా ఒక అమ్మాయికి అబ్బాయి కరెక్ట్ అని ఎలా నిర్ణయిస్తారు అనే టాపిక్ మీద ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకున్న హీరో హీరోయిన్లు.. ఈ కన్ఫ్యూజన్ తీరాలంటే నవంబరు 7న థియేటర్లకు రండి మాట్లాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ భాగస్వామ్యంలో విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఇందులో రష్మిక సరసన ‘దసరా’ ఫేమ్ ధీక్షిత్ శెట్టి శెట్టి కథానాయకుడిగా నటించాడు. ‘చి ల సౌ’తో మెప్పించి.. ‘మన్మథుడు-2’తో షాక్ తిన్న రాహుల్ రవీంద్రన్.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాడు.
This post was last modified on October 4, 2025 9:57 pm
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…