తెలుగు సినిమా షూటింగులు మళ్లీ మొదలయితే అయ్యాయి కానీ ఊహించనంత వేగమయితే లేదు. మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులతో ఏకధాటి షూటింగులు పెట్టుకోకుండా పది, పదిహేను రోజుల షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో వేసవికి విడుదలవుతాయని అనుకున్న పెద్ద సినిమాలు కొన్ని అప్పటికి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ఆచార్య చిత్రం వేసవికి విడుదల కాదట. ఈ చిత్రం కోసం చిరంజీవి, చరణ్ కలిసి నటించే సన్నివేశాలను సంక్రాంతి తర్వాత చిత్రీకరిస్తారట. ఇంకా చాలా భాగం షూటింగ్ పూర్తి కావాల్సి వుంది కనుక మే నెలలో విడుదల చేయడం కుదరదని, కనుక హడావిడి లేకుండా ఈ చిత్రాన్ని దసరా రిలీజ్కి ప్లాన్ చేసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారట.
అలాగే ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ కూడా మళ్లీ విదేశాలకు వెళ్లాల్సి వుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో ఆ చిత్రం కూడా దసరా బరిలోకే వెళుతుందని చెప్పుకుంటున్నారు.
వేసవిలో వకీల్ సాబ్, నారప్ప, టక్ జగదీష్, లవ్స్టోరీ తదితర చిత్రాలు మాత్రమే ఖాయంగా విడుదలవుతాయి. బాలకృష్ణ, బోయపాటి సినిమా కూడా వేసవి తర్వాతే రావచ్చునని సంకేతాలు అందుతున్నాయి. పుష్ప, సర్కారు వారి పాట దసరాకి కూడా రాకపోవచ్చునని అంచనా.
This post was last modified on November 27, 2020 1:47 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…