తెలుగు సినిమా షూటింగులు మళ్లీ మొదలయితే అయ్యాయి కానీ ఊహించనంత వేగమయితే లేదు. మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులతో ఏకధాటి షూటింగులు పెట్టుకోకుండా పది, పదిహేను రోజుల షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో వేసవికి విడుదలవుతాయని అనుకున్న పెద్ద సినిమాలు కొన్ని అప్పటికి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ఆచార్య చిత్రం వేసవికి విడుదల కాదట. ఈ చిత్రం కోసం చిరంజీవి, చరణ్ కలిసి నటించే సన్నివేశాలను సంక్రాంతి తర్వాత చిత్రీకరిస్తారట. ఇంకా చాలా భాగం షూటింగ్ పూర్తి కావాల్సి వుంది కనుక మే నెలలో విడుదల చేయడం కుదరదని, కనుక హడావిడి లేకుండా ఈ చిత్రాన్ని దసరా రిలీజ్కి ప్లాన్ చేసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారట.
అలాగే ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ కూడా మళ్లీ విదేశాలకు వెళ్లాల్సి వుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో ఆ చిత్రం కూడా దసరా బరిలోకే వెళుతుందని చెప్పుకుంటున్నారు.
వేసవిలో వకీల్ సాబ్, నారప్ప, టక్ జగదీష్, లవ్స్టోరీ తదితర చిత్రాలు మాత్రమే ఖాయంగా విడుదలవుతాయి. బాలకృష్ణ, బోయపాటి సినిమా కూడా వేసవి తర్వాతే రావచ్చునని సంకేతాలు అందుతున్నాయి. పుష్ప, సర్కారు వారి పాట దసరాకి కూడా రాకపోవచ్చునని అంచనా.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…