తెలుగు సినిమా షూటింగులు మళ్లీ మొదలయితే అయ్యాయి కానీ ఊహించనంత వేగమయితే లేదు. మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులతో ఏకధాటి షూటింగులు పెట్టుకోకుండా పది, పదిహేను రోజుల షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో వేసవికి విడుదలవుతాయని అనుకున్న పెద్ద సినిమాలు కొన్ని అప్పటికి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ఆచార్య చిత్రం వేసవికి విడుదల కాదట. ఈ చిత్రం కోసం చిరంజీవి, చరణ్ కలిసి నటించే సన్నివేశాలను సంక్రాంతి తర్వాత చిత్రీకరిస్తారట. ఇంకా చాలా భాగం షూటింగ్ పూర్తి కావాల్సి వుంది కనుక మే నెలలో విడుదల చేయడం కుదరదని, కనుక హడావిడి లేకుండా ఈ చిత్రాన్ని దసరా రిలీజ్కి ప్లాన్ చేసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారట.
అలాగే ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ కూడా మళ్లీ విదేశాలకు వెళ్లాల్సి వుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో ఆ చిత్రం కూడా దసరా బరిలోకే వెళుతుందని చెప్పుకుంటున్నారు.
వేసవిలో వకీల్ సాబ్, నారప్ప, టక్ జగదీష్, లవ్స్టోరీ తదితర చిత్రాలు మాత్రమే ఖాయంగా విడుదలవుతాయి. బాలకృష్ణ, బోయపాటి సినిమా కూడా వేసవి తర్వాతే రావచ్చునని సంకేతాలు అందుతున్నాయి. పుష్ప, సర్కారు వారి పాట దసరాకి కూడా రాకపోవచ్చునని అంచనా.
This post was last modified on November 27, 2020 1:47 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…