పెద్దగా అంచనాలు లేకుండా ఇడ్లి కొట్టు సైలెంట్ గా విడుదలైపోయింది. తెలుగులో కుబేర లాంటి స్ట్రెయిట్ హిట్టు కొట్టాక కూడా ధనుష్ మూవీకి ఎలాంటి సందడి కనిపించకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇక్కడ కూడా తనకు ఫాలోయింగ్ ఉంది. అయితే తమిళంలోనూ దీనికి భీభత్సమైన బజ్ లేదు. కాకపోతే ఉన్నంతలో బుకింగ్స్ డీసెంట్ గా ఉండి ట్రెండింగ్ లో కనిపించాయి కానీ రాయన్ రేంజ్ లో అయితే కాదు. ధనుష్ దీని ప్రమోషన్ల కోసం చాలా కష్టపడ్డాడు. నిర్మాత, దర్శకుడు, హీరో ఇలా మొత్తం మూడు బాధ్యతలతో పాటు మార్కెటింగ్ కూడా భుజాన వేసుకుని తమిళనాడు మొత్తం తిరిగాడు.
ఇంతా చేసి ఇడ్లి కొట్టు రిపోర్ట్స్ ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. నిజానికి దీని కథ మొత్తం ధనుష్ ట్రైలర్ లోనే చెప్పేశాడు. స్క్రీన్ మీద కూడా అదే ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న హీరో స్వగ్రామంలో తండ్రి చనిపోయాడని తెలిసి ఇంటికి వస్తాడు. ఆ మరుసటి రోజే దిగులుతో తల్లి కూడా చివరి శ్వాస తీసుకుంటుంది. వాళ్లిదరు ప్రాణంగా చూసుకునే ఇడ్లి కొట్టుని తిరిగి నడిపించాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా ఫారిన్ కంపెనీ ఓనర్, అతని కొడుకు వచ్చి నానా రాద్ధాంతం చేస్తారు. ఎందుకు ఏమిటి అనేదే అసలు స్టోరీ. లైన్ పరంగా బాగానే ఉంది కానీ రెండున్నర గంటల కంటెంట్ కాదిది.
ఎమోషన్లు చాలా బరువుగా ఉండటం, సెంటిమెంట్ ఎక్కువగా దట్టించడం, భావోద్వేగాల కోసం సీన్లను బాగా ల్యాగ్ చేయడం లాంటి కంప్లైంట్స్ ఇడ్లి కొట్టు గురించి వినిపించాయి. సార్ కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన జివి ప్రకాష్ కుమార్ ఈసారి చేతులు ఎత్తేశాడు. అంత గొప్ప సందర్భాలు కూడా రాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంతే. అయితే ధనుష్, నిత్య మీనన్, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్ పెర్ఫార్మన్స్ మరీ బ్యాడ్ వాచ్ కాకుండా కాపాడాయి. టన్నుల్లో ఓపిక ఉన్నా భరించడం కష్టమే అనిపించేలా ఉన్న ఇడ్లి కొట్టు ఓజి, కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ ముందు నిలవడం పెద్ద సవాల్ గా కనిపిస్తోంది.
This post was last modified on October 1, 2025 10:56 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…