అనుకున్నట్టే కాంతార చాప్టర్ 1 ది లెజెండ్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎంతనేది ఇంకా అధికారికంగా బయటికి చెప్పలేదు కానీ ప్రతి టికెట్ మీద 75 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఉండొచ్చని సమాచారం. తెలంగాణలో ఆ ఛాన్స్ లేదు. ఓజికి ఇచ్చిన హైక్స్ వల్ల కోర్టు ఇచ్చిన ట్విస్టుతో అప్పటికప్పుడు ధరలు సవరించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై ఎవరికి స్పెషల్ పర్మిషన్లు, పెంపులు ఉండవని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవలే చెప్పిన నేపథ్యంలో కాంతారా ఒకవేళ హైక్ అడిగినా ఇచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు.
సరే కాంతార విషయంలో కళను కళగా చూడాలి తప్ప ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చేయకూడదని చెప్పిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉద్దేశం మంచిదే అయినా ఇక్కడ ఒక కోణాన్ని మాత్రం సీరియస్ గా చూడాలి. కాంతార ఒక డబ్బింగ్ మూవీ. మన రాష్ట్రంలో షూటింగ్ చేయడం, తెలుగు ఆర్టిస్టులను తీసుకోవడం కానీ చేయలేదు. ఆ మాటకొస్తే నేటివిటీ కూడా కన్నడనే. పంజుర్లి గ్రామ దేవత మనకు పరిచయం లేని పేరు. అయినా ఎమోషన్ కి కనెక్ట్ అయిపోయి ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ చేశాం. అంతమాత్రాన కాంతార మనది అయిపోదు కదాని మూవీ లవర్స్ క్వశ్చన్. దాంట్లో న్యాయం, లాజిక్ రెండూ ఉన్నాయి.
ఇటీవలే ఓజి ప్రీమియర్లకు బెంగళూరులో కొందరు కన్నడ మద్దతుదారులు పెద్ద రచ్చ చేశారు. బ్యానర్లు చించేసి గొడవ చేయడం ఇప్పుడేమి కొత్తగా జరగలేదు. ఆర్ఆర్ఆర్ నుంచి రిపీట్ అవుతూనే ఉంది. అలాంటిది ఇప్పుడు కాంతారా మీద ప్రత్యేక ప్రేమ ఏమిటనేది సినీ ప్రియుల ప్రశ్న. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రికి పవన్ కళ్యాణ్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు వాళ్లే. అందుకే అడిగి ఉండొచ్చు. అసలే జ్వరంతో బాధ పడుతున్న పవన్ కళ్యాణ్ ఇంత లోతుగా అలోచించి ఉండరని, సినిమా బాష ఏదైనా అందరికి చేరువ కావాలనే ఉద్దేశంతో పెంపు ఇచ్చేసి ఉండొచ్చని ఫ్యాన్స్ వెర్షన్. నిజమేనేమో.
This post was last modified on September 29, 2025 10:55 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…