పేరుకు బాలీవుడ్ నటుడే అయినప్పటికీ అనుపమ్ ఖేర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. దానికి రాష్ట్రాలతో సంబంధం లేదు. కార్తికేయ 2తో తెలుగువాళ్లకూ దగ్గరయ్యాడు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నట ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన ఆయన స్వంతంగా నిర్మించి దర్శకత్వం వహించిన తన్వి ది గ్రేట్ మొన్న జూలైలో విడుదలయ్యింది. అరవింద్ స్వామి, బోమన్ ఇరానీ, జాకీ శ్రోఫ్, పల్లవి జోష్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఆయన మీద అభిమానంతో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు. టైటిల్ రోల్ పోషించిన శుభాంగి దత్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో విమర్శకులను మెప్పించింది.
ఇంతా చేసి తన్వి ది గ్రేట్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఎందుకంటే అదే రోజు సైయారా విడుదల కావడం అనుపమ్ ఖేర్ మూవీని నిలువునా చంపేసింది. 400 థియేటర్లలో తన్విని ఆడిస్తున్నా ప్రేక్షకులు ఒక ప్రేమకథను చూసేందుకు సిద్ధంగా ఉండటంతో ఈయన ఎమోషనల్ డ్రామాకు దూరంగా ఉండిపోయారు. ఏడాది పాటు స్క్రిప్ట్, సంగీతం కోసం సంవత్సర కాలం అన్నీ వృథా అయిపోయాయి. అసలు తన్వి ది గ్రేట్ అనే సినిమా వచ్చిందనే సంగతే జనాలకు రిజిస్టర్ కానంత దారుణంగా బొమ్మ బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యింది. దీనికి మన ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చడం మరో విశేషం.
ఇదంతా అనుపమ్ ఖేర్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక హిట్ మూవీకి పోటీగా వెళ్ళినప్పుడు పరిస్థితులు ఒక్కోసారి ఎంత దారుణంగా ఉంటాయో తన్వి ద్వారా తెలుసుకున్నానని అన్నారు. అనుపమ్ ఖేర్ డైరెక్షన్ చేయడం ఇది మొదటిసారి కాదు. 2002లో ఓం జై జగదీశ్ అనే మల్టీస్టారర్ తీశాడు. కానీ ఆడలేదు. మంచి అంచనాలతో వచ్చి ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యింది. ఇప్పుడు తన్వి ది గ్రేట్ తో ఇరవై మూడేళ్ళ తర్వాత అదే ఫలితాన్ని రిపీట్ చేయడం గమనార్హం. గొప్ప ఆర్టిస్టుగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన అనుపమ్ ఖేర్ దర్శకుడిగా వైఫల్యాలు చూడటం ఫైనల్ ట్విస్ట్.
This post was last modified on September 24, 2025 12:04 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…