లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఎలా పొగిడేవాడో తెలిసిందే. పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు కూడా అవి టూమచ్ అనిపించేవి. పవన్ను పొగడ్డానికి మాటలే లేనట్లుగా కొత్త కొత్త పదాలు సృష్టించి ఆయన ట్వీట్లు వేసేవాడు. అలాంటి వ్యక్తే తర్వాతి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పే రోల్లోకి వెళ్లి పవన్ వ్యక్తిత్వ హననానికి ఎంతగా ప్రయత్నించాడో తెలిసిందే. ఓపక్క పవర్ స్టార్, వ్యూహం లాంటి సినిమాలతో పవన్ను కించపరిచే క్రమంలో దిగజారిపోయిన ఆర్జీవీ.. మరోవైపు తన స్థాయికి ఏమాత్రం తగని ట్వీట్లతోనూ వ్యక్తిగా పతనం అయిపోయాడు.
కానీ దీని వల్ల అటు వైసీపీకి ప్రయోజనం లేకపోయింది. ఇటు వర్మ కూడా అథ:పాతాళానికి పడిపోయాడు. ఆ తర్వాత రాజకీయాలకు టాటా చెప్పేసి, క్రెడిబిలిటీ తిరిగి తెచ్చుకోవడానికి వర్మ ఎంత ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం ఉండట్లేదు. ఇలాంటి టైంలో వర్మ వేసిన ‘మెగా’ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేయాలని వర్మ ఆకాంక్షించాడు. సోమవారం చిరంజీవి సినీ జీవితంలో 47 ఏళ్లు నిండాయి. ఆయన తొలి చిత్రం 1978 సెప్టెంబరు 22నే రిలీజైంది. ఈ సందర్భంగా చిరు ఒక స్పెషల్ ట్వీట్తో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అలాగే తన మీద ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ట్వీట్పై పవన్ కూడా స్పందిస్తూ తన అన్నయ్యను కొనియాడాడు. ఈ రెండు ట్వీట్లను ఉటంకిస్తూ వర్మ ఒక పోస్ట్ పెట్టాడు. చిరు, పవన్ కలిసి సినిమా చేస్తే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లందరికీ అది ఒక మెగా పవర్ ఫేవర్ అవుతుందని.. అది ఈ శతాబ్దానికి మెగా పవర్ ఫిలిం అవుతుందని వర్మ వ్యాఖ్యానించాడు. కొన్నేళ్ల కిందట పవన్ మీద నెగెటివ్ ట్వీట్లు వేయడం మొదలు పెట్టాక.. వర్మ మళ్లీ పవర్ స్టార్ను ఉద్దేశించి వేసిన పాజిటివ్ ట్వీట్ కావడంతో ఇది అభిమానుల దృష్టిని ఆకర్షించింది. కానీ వర్మను ఇక ఎప్పటికీ నమ్మలేం అంటూ ఆయన మీద చాలామంది కౌంటర్లే వేశారు.
This post was last modified on September 23, 2025 7:32 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…