Movie News

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆర్జీవీ ‘మెగా’ ట్వీట్

లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఎలా పొగిడేవాడో తెలిసిందే. పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు కూడా అవి టూమచ్ అనిపించేవి. పవన్‌ను పొగడ్డానికి మాటలే లేనట్లుగా కొత్త కొత్త పదాలు సృష్టించి ఆయన ట్వీట్లు వేసేవాడు. అలాంటి వ్యక్తే తర్వాతి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పే రోల్‌లోకి వెళ్లి పవన్ వ్యక్తిత్వ హననానికి ఎంతగా ప్రయత్నించాడో తెలిసిందే. ఓపక్క పవర్ స్టార్, వ్యూహం లాంటి సినిమాలతో పవన్‌ను కించపరిచే క్రమంలో దిగజారిపోయిన ఆర్జీవీ.. మరోవైపు తన స్థాయికి ఏమాత్రం తగని ట్వీట్లతోనూ వ్యక్తిగా పతనం అయిపోయాడు.

కానీ దీని వల్ల అటు వైసీపీకి ప్రయోజనం లేకపోయింది. ఇటు వర్మ కూడా అథ:పాతాళానికి పడిపోయాడు. ఆ తర్వాత రాజకీయాలకు టాటా చెప్పేసి, క్రెడిబిలిటీ తిరిగి తెచ్చుకోవడానికి వర్మ ఎంత ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం ఉండట్లేదు. ఇలాంటి టైంలో వర్మ వేసిన ‘మెగా’ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేయాలని వర్మ ఆకాంక్షించాడు. సోమవారం చిరంజీవి సినీ జీవితంలో 47 ఏళ్లు నిండాయి. ఆయన తొలి చిత్రం 1978 సెప్టెంబరు 22నే రిలీజైంది. ఈ సందర్భంగా చిరు ఒక స్పెషల్ ట్వీట్‌తో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అలాగే తన మీద ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ట్వీట్‌పై పవన్ కూడా స్పందిస్తూ తన అన్నయ్యను కొనియాడాడు. ఈ రెండు ట్వీట్లను ఉటంకిస్తూ వర్మ ఒక పోస్ట్ పెట్టాడు. చిరు, పవన్ కలిసి సినిమా చేస్తే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లందరికీ అది ఒక మెగా పవర్ ఫేవర్ అవుతుందని.. అది ఈ శతాబ్దానికి మెగా పవర్ ఫిలిం అవుతుందని వర్మ వ్యాఖ్యానించాడు. కొన్నేళ్ల కిందట పవన్ మీద నెగెటివ్ ట్వీట్లు వేయడం మొదలు పెట్టాక.. వర్మ మళ్లీ పవర్ స్టార్‌ను ఉద్దేశించి వేసిన పాజిటివ్ ట్వీట్ కావడంతో ఇది అభిమానుల దృష్టిని ఆకర్షించింది. కానీ వర్మను ఇక ఎప్పటికీ నమ్మలేం అంటూ ఆయన మీద చాలామంది కౌంటర్లే వేశారు.

This post was last modified on September 23, 2025 7:32 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

7 seconds ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

6 hours ago