రెండేళ్లకు పైగా ఓజి నామస్మరణలో మునిగి తేలుతూ ఆఖరికి పవన్ కళ్యాణ్ రాజకీయ సామజిక సమావేశాల్లో కూడా ఈ సినిమా ప్రస్తావనే పదే పదే తీసుకొస్తున్న అభిమానులు ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. సెప్టెంబర్ 25 విడుదల కాబోతున్న ఓజికు ముందస్తు ట్రీట్ గా ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలో స్పష్టత ఇచ్చే ట్రైలర్ ఆడియన్స్ ముందుకు తెచ్చేశారు. వాస్తవానికి నిన్న ఈవెంట్ లో లాంచ్ చేయడంతో పాటు ఆన్ లైన్ ఒకేసారి రిలీజ్ చేయాలన్న ప్లానింగ్ చివరి నిముషం సాంకేతిక కారణాల వల్ల నెరవేరలేదు. అందుకే గంటల తరబడి ఆలస్యంగా అయినా ఎట్టకేలకు ఇవాళ యూట్యూబ్ లోకి తెచ్చేశారు.
స్టోరీని పెద్దగా దాచే ప్రయత్నం చేయలేదు. 90 దశకంలో ముంబై నగరాన్ని వణికిస్తున్న ఒమీ భావు (ఇమ్రాన్ హష్మీ) ని ఎదిరించాలంటే ఈ భూమ్మీద ఒక్క ఓజాస్ గంభీర అలియాస్ ఓజి (పవన్ కళ్యాణ్) వల్లే సాధ్యమవుతుందని గుర్తించిన సత్యదాదా (ప్రకాష్ రాజ్) అతన్ని పిలిపించే ప్రయత్నం చేస్తాడు. ఒకప్పుడు మాఫియాని ఏలిన ఓజి అజ్ఞాతం నుంచి బయటికి వచ్చే సమయం ఆసన్నమవుతుంది. శత్రువుకు ఫోన్ చేసి మరీ నేను వస్తున్నా తలలు జాగ్రత్తని వార్నింగ్ ఇస్తాడు. అక్కడి నుంచి తప్పు చేసినవాళ్లను ముక్కలు ముక్కలుగా నరికే విలయ తాండవం మొదలవుతుంది. అసలు ఓజీ ముంబై ఎందుకు వదిలి వెళ్ళాడు, ఇప్పుడెందుకు వచ్చాడనేది అసలు కథ.
అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుజిత్ తన ఫ్యానిజం మొత్తం చూపించేశాడు. లైన్ పరంగా ఇదేమి కొత్తది కాదు, బాషా, సత్య నుంచి చాలాసార్లు చూసిందే. కానీ ఓజి కోసం ఎంచుకున్న నేపధ్యం, ఇంటెన్స్ డ్రామా, వైల్డ్ క్యారెక్టరైజేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. పవన్ ని ఇంత వయొలెంట్ షేడ్ లో చూస్తుంటే ఫ్యాన్స్ సరదాగా చెప్పుకునే శవాలు లేస్తాయి డైలాగ్ నిజమయ్యేలా ఉంది. బయటికి రివీల్ చేయని చాలా సర్ప్రైజులు ఓజి థియేటర్లను ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఎలివేట్ చేయగా రవి కె చంద్రన్ ఛాయాగ్రహణం సాంకేతికంగా ఎత్తులో నిలబడింది. కేవలం పేరుకే ఊగిపోతున్న పవన్ ఫ్యాన్స్ కి ఇక ట్రైలర్ చూశాక గంటలు సంవత్సరాలుగా అనిపించడం ఖాయం.
This post was last modified on September 22, 2025 2:58 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…